Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

లోక్ సభ ఎన్నికలు ఫేజ్-2 : నేటి నుంచే నామినేషన్ల పర్వం

T Ramesh | 11:53 AM, Thu Mar 28, 2024

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా నేటి నుంచి రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ల పర్వం మొదలైంది. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 ఆఖరి గడువు. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది.   ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా,  ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

ఫేజ్ -2లో భాగంగా 12 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.     ఔటర్ మణిపూర్ లో స్థానంలో రెండో దశలో ఎన్నికలు జరగనుండగా, ఇన్నర్ మణిపూర్ స్థానంలో మొదటి దశ నోటిఫికేషన్ లో భాగంగా ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయి.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add

రాజకీయం

google-add
google-add