Friday, May 10, 2024

Logo
Loading...
google-add

రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు

T Ramesh | 15:33 PM, Thu Apr 11, 2024

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు (శుక్రవారం) ఉదయం వెలువడనున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది.  తొలి, రెండో ఏడాది ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు. రికార్డుస్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమైంది.

మార్చి ఒకటి నుంచి  20 వరకు  పరీక్షలు జరిగాయి. మొత్తం 10,53,435 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు.  అందులో  మొదటి ఏడాది పరీక్షలు  5,17,570 మంది విద్యార్ధులు, రెండో ఏడాది పరీక్షలు 5,35,865 మంది రాశారు.

సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి లీకేజ్‌కి ఇంటర్‌ బోర్డు  చెక్ పెట్టింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది. ఫలితాలను httsps://resultsbie.ap.gov.in/ లో  చెక్ చేసుకోవచ్చు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add