పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మరోసారి బాలికలు హవా చాటారు. మొదటి ఏడాదిలో 60.01 శాతం మంది రెండో సంవత్సరంలో 64.19 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో ప్రథమ సంవత్సరంలో 68.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలుర విభాగంలో కేవలం 51.5 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 72.53 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, బాలుర కేటగిరీలో 56.1 శాతం మంది మంది ఉత్తీర్ణత సాధించారు.
జిల్లాల వారీగా చూసుకుంటే ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో, మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లాకు ప్రథమ స్థానం దక్కగా మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
ఫలితాల ను https://tsbie.cgg.gov.in/, http://results.cgg.gov.in లలో తెలుసుకోవచ్చు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగగా 9,80,978 మంది పరీక్షలు రాశారు.
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు