Thursday, May 09, 2024

Logo
Loading...
google-add

రాజానగరంలో కొత్త అభ్యర్ధులతో రంజుగా రాజకీయం

P Phaneendra | 16:56 PM, Sat Apr 27, 2024

Rajanagaram Assembly Constituency Profile

మొదట్లో బూరుగుపూడి నియోజకవర్గంగా ఉన్న శాసనసభా స్థానం 2008లో పునర్‌వ్యవస్థీకరణలో రద్దయింది. రాజానగరం నియోజకవర్గంగా 2009నుంచీ ఎన్నికలు ఎదుర్కొంటోంది.

బూరుగుపూడిలో 1952, 1955 ఎన్నికల్లో కృషికార్ లోక్‌పార్టీ గెలిచింది. 1955 ఉపఎన్నికల నుంచి కాంగ్రెస్ ప్రస్థానం మొదలైంది. 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపొందింది. 1983, 1985 ఎన్నికల్లో కొత్త పార్టీ తెలుగుదేశం విజయాలు అందుకొంది. 1989లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకొన్నా 1994, 1999 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది.

2008లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత 2009లో టిడిపి గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెటుగుదేశం అభ్యర్ధి పెందుర్తి వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్ధి చిట్టూరి రవీంద్రపై విజయం సాధించారు. 2019లో కూడా టిడిపి టికెట్ మీద పెందుర్తి వెంకటేష్, వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి జక్కంపూడి విజయలక్ష్మి మీద గెలిచారు.   

ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తరఫున జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్ధిగా బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ముండ్రు వెంకట శ్రీనివాస్ నిలబడ్డారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add