Friday, May 10, 2024

Logo
Loading...
google-add

కవితకు జుడీషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు

K Venkateswara Rao | 14:37 PM, Tue Apr 23, 2024

ఢిల్లీ మద్యం పాలసీని అనుకూలంగా మలుచుకున్నారనే ఆరోపణలపై అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండును రౌస్ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. సరైన ఆధారాలు లేకుండా ఈడీ, సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇస్తే కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రభావితం చేసే అవకాశముందని, ఆమె చాలా ప్రభావితం చేయగల వ్యక్తని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదలను విన్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు మరో 14 రోజులు జుడీషియల్ రిమాండు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.

ఢిల్లీ మద్యం పాలసీని అనుకూలంగా మార్చు కోవడం ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం చేకూర్చడంతోపాటు, ఆప్ పార్టీకి గోవా, పంజాబ్ ఎన్నికల ఖర్చులకు కవిత రూ.100 కోట్లు ఇచ్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కవితను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. బెయిల్ ఇస్తే కేసులోని వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add