Friday, May 10, 2024

Logo
Loading...
google-add

దంతెవాడలో ఎన్‌కౌంటర్, పోలీస్ కానిస్టేబుల్ మృతి

T Ramesh | 12:25 PM, Thu Apr 25, 2024

 భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులతో  ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్‌కౌంటర్ లో ఒక జ‌వాను ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

దంతెవాడ జిల్లా బార్సూర్ ప‌రిధిలో హంద‌వాడ‌, హిత‌వాడ‌లో మావోయిస్టులు ఉన్నార‌ని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజ‌ర్వ్‌డ్ గార్డ్ పోలీసులు కూంబింగ్ చేపట్టగా, మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో కానిస్టేబుల్ జోగ‌రాజ్ క‌ర్మ మృతి చెందాడు. మ‌రో కానిస్టేబుల్ ప‌ర‌శురామ్‌కు తీవ్ర గాయాల‌ కాగా, చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌కు త‌ర‌లించారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add