Thursday, May 09, 2024

Logo
Loading...
google-add

అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి

T Ramesh | 15:20 PM, Sat Apr 27, 2024

అమెరికాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన ముగ్గురు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం చెందారు. ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ కారు ప్ర‌మాదంలో  మరణించారు. ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎస్‌యూవీ వాహ‌నం  అదుపు తప్పి 20 అడుగుల‌ ఎత్తులో గాలిలోకి లేచి సమీపంలోని చెట్లను ఢీకొట్టినట్లు  గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసులు తెలిపారు. అతి వేగంగా వాహనం ప్రయాణిస్తున్నట్లు చీఫ్ డిప్యూటీ క‌రోన‌ర్ మైక్ ఎల్లిస్ తెలిపారు. ప్ర‌మాదంలో గాయపడిన ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాహ‌నంలో ఉన్న డిటెక్ష‌న్ సిస్ట‌మ్ తో  ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add