Friday, May 10, 2024

Logo
Loading...
google-add

పెళ్ళింట విషాదం, అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు మృతి

T Ramesh | 13:24 PM, Fri Apr 26, 2024

బిహార్ లో దారుణం జరిగింది. వివాహం జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం చోటుచేసుకోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దర్భంగా లోని అలీనగర్‌లో  వివాహం సందర్భంగా పటాకులు కాల్చారు. దీంతో నిప్పురవ్వలు పెళ్ళి పందిరిపై పడి మంటలు రాజుకున్నాయి.  కాసేపట్లోనే మిగతా  ప్రాంతాలకు పాకడంతో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు.

సునీల్ పాశ్వాన్ (26), లీలాదేవి (23), కంచన్ దేవి (26), సిద్ధాంత్ కుమార్ (4), శశాంక్ కుమార్ (3), సాక్షి కుమారి (5) మరణించినట్లు అధికారులు  గుర్తించారు.  ప్రమాదంలో మూడు ఆవులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add