పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
IPL 2024 MATCH 4-RR VS LSG : రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్, ఆదిలోనే లక్నోకు షాక్
ఈడీ విచారణకు మహువా మరోసారి డుమ్మా
తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. క్వాష్ ఫర్ క్వెరీ కేసులో భాగంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మహువాను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నందున విచారణకు హాజరుకాలేనని ఆమె దర్యాప్తు సంస్థకు తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని కృష్ణానగర్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఆమె పోటీకి దిగారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు తాఖీదులు జారీ చేసినప్పటికీ అధికారిక పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనంటూ మహువా బదులిచ్చారు. మహువాతో పాటు దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలు నేడు(గురువారం) విచారణకు హాజరుకావాలనీ బుధవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఫెమా -1999 నిబంధనల ప్రకారం మహువాను ప్రశ్నించి వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
లోక్ పాల్ ఆదేశాల మేరకు క్యాష్ ఫర్ క్వరీ కేసును సీబీఐ కూడా విచారిస్తోంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా), 1999 నిబంధనల ప్రకారం ఈ కేసులో మొయిత్రాను ప్రశ్నించాలని ఏజెన్సీ కోరుతోంది. ఇతరుల నుంచి లబ్ధిపొంది, ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ గ్రూపు లక్ష్యంగా ముహువా, పార్లమెంటులో ప్రశ్నలు అడిగినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించడంతో ఆమెను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించింది. ఆరోపణలు నిజమని నిర్ధారిస్తూ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు సిఫార్సు చేసింది. దీంతో స్పీకర్, మహువా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
Trending Tag
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్
శ్రీలంక, యూఏఈ దేశాలకు ఉల్లి ఎగుమతులకు అనుమతించిన భారత్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్