పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ : జెండాలను జతకట్టిన వారిని ఓడించాలని జగన్ పిలుపు
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం యాత్ర’ మూడో రోజు కొనసాగుతోంది. నంద్యాల జిల్లాలో గురువారం పర్యటించిన జగన్, నేడు కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో యాత్ర కొనసాగిస్తున్నారు. ఎమ్మిగనూరులో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు.
పెంచికలపాడు నుంచి జగన్ యాత్ర ప్రారంభం కాగా పెద్దసంఖ్యలో వైసీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. టీడీపీ నేత కృష్ణా రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. హెచ్ కైరవాడిలో జగన్ నిర్వహించిన రోడ్ షోకి విశేష స్పందన లభించింది.
ఎమ్మిగనూరు సభ లో జనసముద్రం కనిపిస్తోందన్న జగన్, మే 13న కురుక్షేత్ర యుద్దం జరగబోతుందన్నారు. పేదలంతా ఓ వైపు ఉంటే పెత్తందారులు మరో వైపు ఉన్నారన్నారు. పేదల పక్షాన నిలబడి పెత్తందారులను ఓడించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపిన జగన్, మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రజలను ప్రశ్నించారు. జెండాలు జత కట్టిన వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారా అని కోరారు. గడిచిన ఐదేళ్ళ వైసీపీ పాలనలో ప్రతీఇంటికి మంచి జరిగిందన్నారు. గడిచిన 58 నెలల్లో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.
Trending Tag
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్