పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
హోలీ రోజు మైనర్బాలికపై సామూహిక అత్యాచారం
Minor gangraped on Holi in Assam
అస్సాంలోని ప్రధాన నగరం గౌహతిలో హోలీ పండుగ రోజు
ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో ప్రధాన
నిందితుడైన ఇనాముల్ అలీ, తన అనుచరులైన రాజు అలీ, మండల్ అలీలతో కలిసి ఆ బాలికకు మత్తుమందు
ఇచ్చి, వారితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పోలీసులకు తెలిసిన సమాచారం ప్రకారం, నేరస్తులు భగదత్తపూర్లో ముగ్గురు అమ్మాయిలను హోలీ వేడుకల పేరిట ఇన్నోవా కారులో ఎక్కించుకున్నారు. అక్కడినుంచి కహిలిపరా, గౌహతి వంటి ప్రదేశాల్లో తిప్పారు. ఆ తర్వాత ఇనాముల్ అలీ వారిలోని మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి, మిగతా ఇద్దరు అమ్మాయిల ముందే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇనాముల్ స్నేహితులు ఆ మొత్తం వ్యవహారాన్ని ఫోన్లో చిత్రీకరించారు. తర్వాత మరో ఇద్దరు నిందితులు కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడున్న మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ నేరంలో వారికి సహకరించినట్లు సమాచారం.
అత్యాచారం తర్వాత నిందితులు బాధిత బాలికను కహిలిపరాలోని ఆమె నివాసం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. స్థానికులు ఆ బాలికను తీవ్రంగా గాయపడిన స్థితిలో కనుగొని, గౌహతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. బాధితురాలు ఇంకా అక్కడే చికిత్స పొందుతోంది.
బాధితురాలి కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు భగదత్తపూర్ ఔట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసులో ఇనాముల్ అలీ సహనిందితులైన రాజు అలీని హతిగావ్లోనూ, మండల్ అలీని అజారా ఏరియాలోనూ బంధించారు. వారిని దిస్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే, నేరంలో ఉపయోగించిన ఇన్నోవా కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇనాముల్ అలీ మాత్రం ఇంకా దొరకలేదు. అతని కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు.
Trending Tag
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్