పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
కేజ్రీవాల్ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు
Kejriwal Custody Extended by Four More Days
అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ గడువును
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. మద్యం పాలసీ
కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది.
కేజ్రీవాల్ను మార్చి 15న ఈడీ అధికారులు ఆయన ఇంటినుంచి అరెస్ట్ చేసారు. ఆయనకు న్యాయస్థానం ఇవాళ్టి వరకూ కస్టడీ విధించింది. అయితే కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని, కనీసం మరో వారం రోజులు విచారణకు కావాలనీ ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. వారి మనవిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. కేజ్రీవాల్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది.
లిక్కర్ పాలసీ కేసు విచారణలో అరవింద్ కేజ్రీవాల్ తన పేరును నలుగురు మాత్రమే ప్రస్తావించారనీ, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేందుకు ఆ నాలుగు వాంగ్మూలాలే సరిపోతాయా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇవాళ కోర్టులో కేజ్రీవాల్ తన కేసును తానే వాదించుకున్నారు.
మద్యం విధానం కేసు రాజకీయ కుట్ర అని, దానికి ప్రజలే తగిన జవాబు చెబుతారనీ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కోర్టులోకి వెడుతుండగా మీడియా ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్
శ్రీలంక, యూఏఈ దేశాలకు ఉల్లి ఎగుమతులకు అనుమతించిన భారత్