పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
బస్సు లోయలో పడి 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోరం జరిగింది. ఓ బస్సు వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి ప్రాణాలతో బయట పడింది. ఈస్టర్ పండగను పురష్కరించుకుని, కొందరు బస్సులో చర్చికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పిన బస్సు 105 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రవాణా శాఖ అధికారి వెల్లడించారు.
46 మందితో కూడిన బస్సు బోట్స్వానా నుంచి మోరియాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్రోడ్డుపై నిర్మించిన వంతెన వద్ద బస్సు అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బతికి బయటపడ్డ బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.
Trending Tag
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్
ఎన్నికల ఏడాదిలో భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రశంసించిన ఐఎంఎఫ్