Monday, April 29, 2024

Logo
Loading...
google-add

బస్సు లోయలో పడి 45 మంది మృతి

K Venkateswara Rao | 10:32 AM, Fri Mar 29, 2024

దక్షిణాఫ్రికాలో ఘోరం జరిగింది. ఓ బస్సు వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చిన్నారి ప్రాణాలతో బయట పడింది. ఈస్టర్ పండగను పురష్కరించుకుని, కొందరు బస్సులో చర్చికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పిన బస్సు 105 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక రవాణా శాఖ అధికారి వెల్లడించారు.



46 మందితో కూడిన బస్సు బోట్స్‌వానా నుంచి మోరియాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్డుపై నిర్మించిన వంతెన వద్ద బస్సు అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బతికి బయటపడ్డ బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add

రాజకీయం

google-add
google-add