Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి, మృతుల్లో ఐదుగురు చైనీయులు

T Ramesh | 17:25 PM, Tue Mar 26, 2024

పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లో ఆత్మాహుతి దాడి ఘటనలోఆరుగురు చనిపోయారు. వీరిలో ఐదుగురు చైనీయులతో పాటు ఓ పాకిస్తానీ ఉన్నారు. ఇస్లామాబాద్ నుంచి దసు ప్రాంతంలోని తమ క్యాంపుకు చైనా ఇంజినీర్ల టీమ్ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌ను , ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో ఢీకొట్టాడు.  దీంతో ఐదుగురు చైనా ఇంజినీర్లు, వారి వాహనం డ్రైవర్ గా ఉన్న ఓ పాకిస్తానీ జాతీయుడు మరణించారు.

పేలుడు ధాటికి చైనా ఇంజినీర్ల వాహనం రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న ఓ గోతిలోకి ఎగిరిపడింది, అనంతరం మంటలు అలుముకోవడంతో కాలి బూడిద అయింది.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

వీడియోలు

తేజస్‌లో మోదీ

P Phaneendra | 15:40 PM, Sat Nov 25, 2023
google-add
google-add