Friday, May 03, 2024

Logo
Loading...
google-add

దిల్లీ లిక్కర్ స్కామ్ : సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా శరత్ చంద్రారెడ్డి

T Ramesh | 16:58 PM, Fri Apr 19, 2024

దిల్లీ మద్యం పాలసీ కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులో కూడా నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.  ఇప్పటికే ఈడీ కేసులో  శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారగా, మాగుంట రాఘవ్, దినేశ్ అరోరా కూడా  అప్రూవర్లుగా మారినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగం మోపింది. దిల్లీ మద్యం స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add