పారిస్ ఒలింపిక్స్ మెనూలో అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ
‘వర్తమానంతో పాటు భవిష్యత్ లోనూ కాషాయపార్టీదే హవా’
దేశ రాజకీయాలపై బాలీవుడ్ నటీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోందని.. భవిష్యత్తులోనూ అదే కొనసాగుతుందని ఆకాంక్షించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కంగన.. రాజస్థాన్ లోని జోధ్పూర్ లో బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్ కు మద్దతుగా ప్రచారం చేశారు.
రాజస్థానీ తలపాగా, బీజేపీ జెండాతో రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఆమె ర్యాలీని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో బీజేపీపై ప్రేమ, ఆప్యాయత కనిపిస్తున్నాయన్న కంగనా, జోధ్ పూర్ ప్రజలకు బీజేపీపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోందని.. ఇకపైనా ఆ అలలు కొనసాగుతాయని కంగన ధీమా వ్యక్తం చేశారు.
జోధ్ పూర్ లో ప్రచారం తర్వాత అటు నుంచి పాలి వెళ్ళి బీజేపీ నేత పీపీ చౌదరికి మద్దతుగా ప్రచారం చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణలు, విమర్శలను బలంగా తిప్పికొట్టినట్లు చెప్పారు.
Trending Tag
స్టాక్ మార్కెట్ల దూకుడు : భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
వరుస లాభాలకు బ్రేక్ : నష్టాల్లో ముగిసిన స్టాక్ సూచీలు
బ్యాంకింగ్ స్టాక్స్ దూకుడు : భారీ లాభాల్లో స్టాక్ సూచీలు
నిధులివ్వలేదు, పోటీ చేయలేనంటూ తప్పుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి
రేపల్లె పోరు: హ్యాట్రిక్ కోసం టీడీపీ, ఖాతా తెరవాలని వైసీపీ తహతహ