Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

బిహార్ లో దారుణం, జేడీయూ యువనేతను కాల్చి చంపిన దుండగులు

T Ramesh | 12:34 PM, Thu Apr 25, 2024

బిహార్‌ లో దారుణం జరిగింది. సీఎం నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూకి చెందిన యువ నాయకుడు హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు యువనేతను కర్కశంగా  కాల్చి చంపారు.   సౌరభ్‌ కుమార్‌ అనే జేడీయూ యువనేత  తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాట్నాలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో  సమయంలో నలుగురు వ్యక్తులు బైక్‌పై వచ్చి సౌరభ్‌పై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన సౌరభ్ కుమార్  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సౌరభ్ మృతిని పోలీసులు నిర్దారించారు.  దాడిలో గాయపడిన మరో వ్యక్తికి గాయాలయ్యాయని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్ లు ఇండీ కూటమి పేరిట పోటీ చేస్తున్నాయి. ఎన్డీయే వెర్సెస్ ఇడీ కూటమిగా బిహార్ రాజకీయాలు సాగుతున్నాయి.

google-add
google-add
google-add

క్రైమ్ న్యూస్

ఆధ్యాత్మికం

google-add

ఆర్థికం

google-add
google-add