మే నెల పింఛన్లు బ్యాంకు ఖాతాలో జమ
K Venkateswa... | 19:22 PM, Sun Apr 28, 2024
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన అమిత్ షా
T Ramesh | 18:00 PM, Sun Apr 28, 2024
‘నవాబులు, సుల్తానుల అరాచకాలు మరిచిపోయారా రాహుల్’
T Ramesh | 17:55 PM, Sun Apr 28, 2024
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
T Ramesh | 17:46 PM, Sun Apr 28, 2024
బీజేపీలో చేరిన సమాజ్వాదీ పార్టీ కీలక నేతలు
K Venkateswa... | 17:46 PM, Sun Apr 28, 2024
రూ.600 కోట్ల డ్రగ్స్ తరలిస్తోన్న పాక్ పడవ స్వాధీనం
K Venkateswa... | 17:41 PM, Sun Apr 28, 2024
ప్రజలంతా బీజేపీ వెంటే, ఎన్డీయేదే అధికారం : ప్రధాని మోదీ
T Ramesh | 13:35 PM, Sun Apr 28, 2024
రిజరేష్వన్ల అమలుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు :మోహన్ భగవత్
T Ramesh | 13:16 PM, Sun Apr 28, 2024
అమెరికాలో టోర్నడోల బీభత్సం
T Ramesh | 11:46 AM, Sun Apr 28, 2024
ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా
K Venkateswa... | 11:41 AM, Sun Apr 28, 2024
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, మేలో ముఖ్య ఉత్సవాలు
T Ramesh | 11:08 AM, Sun Apr 28, 2024
లేని నియోజకవర్గానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్ధి
Congress candidate files nomination for non-existent constituency
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మణిపూర్లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అంగోమ్చా బిమొల్ అకోయ్జామ్ నామినేసన్ను తిరస్కరించాలంటూ బీజేపీ అభ్యర్ధి తొనావ్జామ్ బసంతకుమార్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తప్పుల తడకగా ఉందన్నది ఆయన ఫిర్యాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమిటో తెలుసా? లోక్సభా స్థానానికి నామినేషన్ వేయవలసిన దరఖాస్తులో లేని సీటు పేరు రాయడమే.
బసంత్కుమార్ ఫిర్యాదు ప్రకారం, డాక్టర్ అకోయ్జామ్ తన నామినేషన్ పత్రాలను తప్పుగా నింపి దాఖలు చేసారు. లోక్సభ ఎన్నికలకు పోటీచేస్తూ తన దరఖాస్తులో ఆయన ఎంపీ సీటుగా ఉనికే లేని నియోజకవర్గం పేరు రాసారు. మార్చి 27న అంటే నిన్న దాఖలు చేసిన పత్రాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి అకోయ్జామ్ ‘‘12 కెయిషామ్తాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం’’ అని పేరు రాసారు. దానికీ ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలకూ సంబంధమే లేదు.
తప్పుడు పత్రాలు దాఖలు చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ అకోయ్జామ్ ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 లోని పలు నిబంధనలను అకోయ్జామ్ ఉల్లంఘించారని బసంతకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అకోయ్జామ్ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాల్లోనే అవే తప్పులు పునరావృతం అయ్యాయి. అన్నింటిలోనూ అసెంబ్లీ నియోజక వర్గం పేరునే రాసారు. ‘ఇన్నర్ మణిపూర్’ అని లోక్సభ నియోజకవర్గం పేరు రాయవలసిన చోట తప్పు పేరు రాయడం, అది కూడా నాలుగు సెట్ల పత్రాల్లోనూ ఒకేలా రాయడం విశేషం.
బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుతం మణిపూర్ విద్యాశాఖ మంత్రి అయిన బసంతకుమార్, అది కేవలం సాధారణ తప్పిదం కాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందనీ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై వివరణ కోసం డాక్టర్ అకోయ్జామ్తో మాట్లాడడానికి ప్రయత్నించిన మీడియాకు నిరాశే మిగిలింది. ఆయన ఫోన్ స్విచాఫ్లో ఉంది, ఆయన అందుబాటులో లేరు. అయితే అకోయ్జామ్ న్యాయబృందం, తప్పులను సవరించామని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామనీ హామీ ఇచ్చింది.
మణిపూర్లో రెండు లోక్సభ స్థానాలున్నాయి. అవి... ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్. ఇన్నర్ మణిపూర్కు, ఔటర్ మణిపూర్లోని కొన్ని ప్రాంతాలకూ ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్లోని మిగతా ప్రాంతాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి అంటే...?
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
‘రెండు రాజ్యాల పరిష్కారాని’కి ఇజ్రాయెల్ ఒప్పుకుంటే హమాస్ను రద్దు చేస్తాం
అమెరికా యూనివర్సిటీల్లో అలజడి : వందలాది విద్యార్ధుల అరెస్ట్
గాజువాక పిల్లకు గాజులు తొడిగేది ఎవరు?
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు