హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
మణిపూర్లో 11 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్
Repolling in 11 stations in Manipur
మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గం
పరిధిలోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఈ రీపోలింగ్ కోసం పటిష్ట
భద్రతా ఏర్పాట్లు చేసామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ
అధికారులు వెల్లడించారు.
మణిపూర్లో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరిగాయి. అయితే 11 కేంద్రాల్లో జరిగిన పోలింగ్ను ఎన్నికల కమిషన్ చెల్లదంటూ రద్దు చేసింది. అక్కడ హింసాత్మక ఘటనలతో పాటు ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దాంతో ఇవాళ రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.
‘‘శుక్రవారం జరిగిన పోలింగ్ సమయంలో 11 కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. దాంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నాము. ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాల దగ్గర ఉదయం నుంచే బారులు తీరారు’’ అని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
ఇన్నర్ మణిపూర్ లోక్సభ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఏప్రిల్ 19న జరిగిన ఎన్నికల సమయంలో ఆ కేంద్రాల్లో కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం, బూత్ కాప్చరింగ్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలకు ముందు మణిపూర్లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ సమయంలో కూడా ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మణిపూర్లో రెండు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ అనే ఆ రెండు స్థానాలకూ మొదటి దశలోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం 72శాతం పోలింగ్ నమోదయింది. ఔటర్ మణిపూర్లోని 13 సెగ్మెంట్లకు మాత్రం ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరుగుతుంది.
లేని నియోజకవర్గానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్ధి
Congress candidate files nomination for non-existent constituency
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మణిపూర్లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అంగోమ్చా బిమొల్ అకోయ్జామ్ నామినేసన్ను తిరస్కరించాలంటూ బీజేపీ అభ్యర్ధి తొనావ్జామ్ బసంతకుమార్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తప్పుల తడకగా ఉందన్నది ఆయన ఫిర్యాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమిటో తెలుసా? లోక్సభా స్థానానికి నామినేషన్ వేయవలసిన దరఖాస్తులో లేని సీటు పేరు రాయడమే.
బసంత్కుమార్ ఫిర్యాదు ప్రకారం, డాక్టర్ అకోయ్జామ్ తన నామినేషన్ పత్రాలను తప్పుగా నింపి దాఖలు చేసారు. లోక్సభ ఎన్నికలకు పోటీచేస్తూ తన దరఖాస్తులో ఆయన ఎంపీ సీటుగా ఉనికే లేని నియోజకవర్గం పేరు రాసారు. మార్చి 27న అంటే నిన్న దాఖలు చేసిన పత్రాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి అకోయ్జామ్ ‘‘12 కెయిషామ్తాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం’’ అని పేరు రాసారు. దానికీ ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలకూ సంబంధమే లేదు.
తప్పుడు పత్రాలు దాఖలు చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ అకోయ్జామ్ ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 లోని పలు నిబంధనలను అకోయ్జామ్ ఉల్లంఘించారని బసంతకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అకోయ్జామ్ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాల్లోనే అవే తప్పులు పునరావృతం అయ్యాయి. అన్నింటిలోనూ అసెంబ్లీ నియోజక వర్గం పేరునే రాసారు. ‘ఇన్నర్ మణిపూర్’ అని లోక్సభ నియోజకవర్గం పేరు రాయవలసిన చోట తప్పు పేరు రాయడం, అది కూడా నాలుగు సెట్ల పత్రాల్లోనూ ఒకేలా రాయడం విశేషం.
బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుతం మణిపూర్ విద్యాశాఖ మంత్రి అయిన బసంతకుమార్, అది కేవలం సాధారణ తప్పిదం కాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందనీ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై వివరణ కోసం డాక్టర్ అకోయ్జామ్తో మాట్లాడడానికి ప్రయత్నించిన మీడియాకు నిరాశే మిగిలింది. ఆయన ఫోన్ స్విచాఫ్లో ఉంది, ఆయన అందుబాటులో లేరు. అయితే అకోయ్జామ్ న్యాయబృందం, తప్పులను సవరించామని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామనీ హామీ ఇచ్చింది.
మణిపూర్లో రెండు లోక్సభ స్థానాలున్నాయి. అవి... ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్. ఇన్నర్ మణిపూర్కు, ఔటర్ మణిపూర్లోని కొన్ని ప్రాంతాలకూ ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్లోని మిగతా ప్రాంతాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది.