హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
లేని నియోజకవర్గానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్ధి
Congress candidate files nomination for non-existent constituency
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మణిపూర్లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ అంగోమ్చా బిమొల్ అకోయ్జామ్ నామినేసన్ను తిరస్కరించాలంటూ బీజేపీ అభ్యర్ధి తొనావ్జామ్ బసంతకుమార్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ తప్పుల తడకగా ఉందన్నది ఆయన ఫిర్యాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమిటో తెలుసా? లోక్సభా స్థానానికి నామినేషన్ వేయవలసిన దరఖాస్తులో లేని సీటు పేరు రాయడమే.
బసంత్కుమార్ ఫిర్యాదు ప్రకారం, డాక్టర్ అకోయ్జామ్ తన నామినేషన్ పత్రాలను తప్పుగా నింపి దాఖలు చేసారు. లోక్సభ ఎన్నికలకు పోటీచేస్తూ తన దరఖాస్తులో ఆయన ఎంపీ సీటుగా ఉనికే లేని నియోజకవర్గం పేరు రాసారు. మార్చి 27న అంటే నిన్న దాఖలు చేసిన పత్రాల్లో కాంగ్రెస్ అభ్యర్ధి అకోయ్జామ్ ‘‘12 కెయిషామ్తాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం’’ అని పేరు రాసారు. దానికీ ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలకూ సంబంధమే లేదు.
తప్పుడు పత్రాలు దాఖలు చేయడం ద్వారా కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ అకోయ్జామ్ ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 లోని పలు నిబంధనలను అకోయ్జామ్ ఉల్లంఘించారని బసంతకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అకోయ్జామ్ దాఖలు చేసిన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాల్లోనే అవే తప్పులు పునరావృతం అయ్యాయి. అన్నింటిలోనూ అసెంబ్లీ నియోజక వర్గం పేరునే రాసారు. ‘ఇన్నర్ మణిపూర్’ అని లోక్సభ నియోజకవర్గం పేరు రాయవలసిన చోట తప్పు పేరు రాయడం, అది కూడా నాలుగు సెట్ల పత్రాల్లోనూ ఒకేలా రాయడం విశేషం.
బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుతం మణిపూర్ విద్యాశాఖ మంత్రి అయిన బసంతకుమార్, అది కేవలం సాధారణ తప్పిదం కాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందనీ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై వివరణ కోసం డాక్టర్ అకోయ్జామ్తో మాట్లాడడానికి ప్రయత్నించిన మీడియాకు నిరాశే మిగిలింది. ఆయన ఫోన్ స్విచాఫ్లో ఉంది, ఆయన అందుబాటులో లేరు. అయితే అకోయ్జామ్ న్యాయబృందం, తప్పులను సవరించామని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామనీ హామీ ఇచ్చింది.
మణిపూర్లో రెండు లోక్సభ స్థానాలున్నాయి. అవి... ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్. ఇన్నర్ మణిపూర్కు, ఔటర్ మణిపూర్లోని కొన్ని ప్రాంతాలకూ ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఔటర్ మణిపూర్లోని మిగతా ప్రాంతాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది.
ఆప్ అభ్యర్థే చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు జోక్యంతో చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక వివాదం కొలిక్కి వచ్చింది. సుప్రీం ఆదేశాలతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఊరట దక్కింది. ఆప్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం కొట్టివేసింది.
రిటర్నింగ్ అధికారి ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు కోర్టు గుర్తించింది.. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాల ప్రకారం, చండీగఢ్ మేయర్గా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ‘ఆప్’ నేత, మేయర్ అభ్యర్థి కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి కీలక తీర్పు వెల్లడించింది. రిటర్నింగ్ ఆఫీసర్ చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను స్వయంగా పరిశీలించిన ధర్మాసనం అవి ఎక్కడ పాడైపోయాయి? ఎందుకు చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్ మాసిని నిలదీసింది. ఆ 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు నిర్ధారించింది.
ఆప్ అభ్యర్థికి అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే చెల్లనివిగా గుర్తించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని తెలిపింది. అనిల్ మాసిపై సీఆర్పీఎస్ సెక్షన్ 340 కింద విచారణకు ఆదేశించింది.
చండీగఢ్ మేయర్ ఎన్నిక జనవరి 30న జరిగింది. కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉండగా బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీ 8 ఓట్లపై రహస్యంగా ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించారు. ఈ వీడియో బయటకు రావడంతో ఆప్ కోర్టును ఆశ్రయించింది.