Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

బుక్కరాయసముద్రంలో చంద్రబాబు : సంపద సృష్టిస్తా, నిజమైన బటన్ నొక్కుతా

T Ramesh | 17:22 PM, Thu Mar 28, 2024

టీడీపీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపదా సృష్టిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదాయాన్ని పెంచుతూ పేదలకు పంచుతానని చెప్పారు. నిజమైన బటన్ నొక్కి పేదల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్ర, ఉమ్మడి అనంతపురంలో కొనసాగుతోంది. బుక్కరాయసముద్రంలో ఆయన ప్రసంగిస్తూ... సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్ఘాటించారు. 

ఆడబిడ్డ నిధి కింద ప్రతీ మహిళకు నెలకు రూ.1,50 0 అందజేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు,  ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటి వారి ఖాతాలో నేరుగా జమ చేస్తామని చెప్పారు. తల్లికి వందనం పథకం కిద ఒక బిడ్డ ఉంటే రూ.15,000. ఇద్దరు బిడ్డలుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురుంటే రూ.60 వేలు, ఇచ్చే బాధ్యత తనది అని చంద్రబాబు వాగ్దానం చేశారు.

ఆర్టీసీ ఎర్ర బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం  కల్పించడంతో పాటు ప్రతీ  రైతుకు రూ.20 వేల ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే సామాజిక పింఛను  రూ.4 వేలకు పెంచుతామన్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add