IPL 2024 MATCH 4-RR VS LSG : రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్, ఆదిలోనే లక్నోకు షాక్
IPL -2024 : దిల్లీ కేపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం
ఐపీఎల్ -17వ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్, దిల్లీ కేపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కీలక ట్వీస్ట్ చోటుచేసుకుంది. ఆఖరి ఓవర్ లో విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా పంజాబ్ ఆటగాడు లియామ్ లివింగ్ స్టన్ సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
దిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 175 పరుగుల విజయలక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. లివింగ్ స్టన్ 21 బంతుల్లో 38 పరుగులు చేసి అజేయంగా నిలవగా, శామ్ కరన్(63) రాణించాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ (22), ప్రభ్ సిమ్రన్ సింగ్ (26) పరుగులు చేయగా, ఓపెనర్ జానీ బెయిర్ స్టో (9) నిరాశపరిచాడు.
దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ 1 వికెట్ తీశారు. టోర్నీలో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ కు హార్థిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో ఇరు జట్లుకు ఇదే తొలి మ్యాచ్.