Friday, May 10, 2024

Logo
Loading...
google-add

రాజ్‌కోట్ టెస్ట్ : రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో నిలబడిన భారత్

P Phaneendra | 18:02 PM, Thu Feb 15, 2024

Bharat scores 326/5 on Day 1 of Test 3 at Rajkot

రాజ్‌కోట్‌లో జరుగుతున్న భారత్ ఇంగ్లండ్ మూడో టెస్టు మొదటిరోజు ఆటలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు సాధించింది.

ఆట ప్రారంభంలోనే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. 22 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్, 24 పరుగుల దగ్గర శుభ్‌మన్ గిల్, 33 పరుగుల దగ్గర రజత్ పటీదార్ ఔటయ్యేసరికి మ్యాచ్ 9 ఓవర్లు కూడా పూర్తవలేదు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని నిలబెట్టాడు. 196 బాల్స్ ఆడి 131 పరుగులు చేసాక ఔటయ్యాడు. రవీంద్ర జడేజా కొంచెం మందకొడిగానే అయినా నిలకడగా ఆడుతున్నాడు. 212 బాల్స్‌లో 110 పరుగులు చేసి ఇంకా నాటౌట్‌గా ఉన్నాడు. మొదటిసారి టెస్ట్ మ్యాచ్ అవకాశం వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా బాగానే ఆడాడు. 66 బాల్స్‌లో 62 పరుగులు చేసి రనౌట్ అయాడు. జడేజా, కులదీప్ యాదవ్ రేపటి ఆటను కొనసాగిస్తారు.

ఇంగ్లండ్ బౌలర్స్‌లో మార్క్ వుడ్ ప్రతిభ చూపించాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రోహిత్ శర్మలను అతనే ఔట్ చేసాడు.

google-add
google-add
google-add

క్రికెట్

google-add
google-add
google-add