Friday, May 10, 2024

Logo
Loading...
google-add

భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ మొదలు, మొదట్లోనే వికెట్ కోల్పోయిన భారత్

P Phaneendra | 10:12 AM, Thu Feb 15, 2024

Bharat loses first wicket early in 3rd test with England

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సీరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్‌లో మొదలైంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికి జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ చెరొక మ్యాచ్‌లో గెలిచాయి.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ భారత బ్యాటింగ్ ప్రారంభించారు. నాలుగో ఓవర్ ఐదో బంతికి భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 10 పరుగులు మాత్రం చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. నాలుగు ఓవర్లు పూర్తయేసరికి భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 22 పరుగులుగా ఉంది.

భారత జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ, మార్క్‌వుడ్, జేమ్స్ ఆండర్సన్ ఉన్నారు.

google-add
google-add
google-add

క్రికెట్

google-add
google-add
google-add