Sunday, April 28, 2024

Logo
Loading...
google-add

భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు: ఆళ్లగడ్డలో ‘మేమంతా సిద్ధం’

T Ramesh | 18:12 PM, Thu Mar 28, 2024

ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత, సీఎం జగన్‌, తమ పాలనలో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారన్నారు. యర్రగుంట్ల పరిధిలో 1,496 ఇళ్లకు గాను 1,391 ఇళ్లకు లబ్ధి జరిగిందన్నారు.

అమ్మ ఒడి కింద 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా మూడు కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరిందని వివరించిన  సీఎం జగన్‌ ఆరోగ్యశ్రీ కింద రెండు కోట్ల మందికి మేలు జరిగిందన్నారు. ఎన్నడూ జరగని విధంగా వైసీపీ పాలనలో గ్రామాలు బాగుపడ్డాయన్నారు.  ప్రజలు భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు జరుగుతున్నాయన్న జగన్, ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add