హర్యానా సంక్షోభం నేపథ్యంలో చౌతాలా వర్గం ఎమ్మెల్యేలు బీజేపీ నేతతో భేటీ
P Phaneendra | 17:55 PM, Thu May 09, 2024
డీఎల్ డీల్ తో మైదుకూరు లెక్కలు మారేనా
T Ramesh | 17:39 PM, Thu May 09, 2024
ప్రొద్దుటూరు లో గురుశిష్యుల మధ్య పోటీ
T Ramesh | 16:41 PM, Thu May 09, 2024
సందీప్ కిషన్ కొత్త సినిమా ‘మాయా వన్’ టీజర్ విడుదల అయింది
P Phaneendra | 16:31 PM, Thu May 09, 2024
మన ప్రధానమంత్రులు : మన్మోహన్ సింగ్ - 1
P Phaneendra | 16:15 PM, Thu May 09, 2024
జమ్మలమడుగులో కమలం వికసిస్తుందా...?
T Ramesh | 16:09 PM, Thu May 09, 2024
కమలాపురం ఎవరి పక్షం...?
T Ramesh | 15:27 PM, Thu May 09, 2024
పులివెందులలో తిరుగులేని వైఎస్ ఫ్యామిలీ
T Ramesh | 14:58 PM, Thu May 09, 2024
కడప అసెంబ్లీలో జోరు ఎవరిది...?
T Ramesh | 13:30 PM, Thu May 09, 2024
బద్వేలు- 2024 ఎవరిది...?
T Ramesh | 13:19 PM, Thu May 09, 2024
లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు
T Ramesh | 13:09 PM, Thu May 09, 2024
టీడీపీకి ‘యనమల’ గుడ్ బై, వైసీపీని వీడిన డొక్కా
ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆయారాం, గయారాంల హడావుడి అంతా ఇంతా కాదు. అప్పటి వరకు తాము ఉన్న పార్టీని వేనోళ్ళ పొగిడిన నేతలు టికెట్ దక్కలేదని కొందరు, ప్రాధాన్యంలేదని మరికొందరు పార్టీలు వీడుతున్నారు. అప్పటివరకు తిట్టిన పార్టీలోకే పొలోమని చేరుతున్నారు.
తాజాగా టీడీపీ అగ్రనేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు పార్టీ మారారు. గత రెండు దఫాలుగా సైకిల్ గుర్తుపై అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన కృష్ణుడికి ఈ సారి టీడీపీ టికెట్ దక్కలేదు. యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య ఈసారి పోటీలో ఉన్నారు. దీంతో యనమల కృష్ణుడు పార్టీ మారారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేసి టికెట్ దక్కకుండా కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.సీఎం జగన్ ఆహ్వానం మేరకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తునిలో వైసీపీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తానని చెప్పారు.
ఇక మాజీమంత్రి, గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని వీడారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(రిజర్వుడు) స్థానం నుంచి సైకిల్ గుర్తు పై పోటీ చేసిన మాణిక్య వరప్రసాద్, వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటన సమయంలో టీడీపీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు. తాడికొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది.
తాడికొండ నుంచి ఫ్యాన్ గుర్తుపై మాజీ మంత్రి సుచరిత పోటీ చేస్తున్నారు. దీంతో తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ మాణిక్య వరప్రసాద్ కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రి వర్గంలో డొక్కా మాణిక్య ప్రసాద్ పనిచేశారు.
భద్రాద్రి రాములోరి తలంబ్రాలు నేరుగా ఇంటికే కావాలా ఇలా చేయండి
హోదా వద్దు ప్యాకేజీనే కావాలని చంద్రబాబే అడిగారు : పురందరేశ్వరి
ఉగాది శోభ : ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పుణ్యక్షేత్రాల్లో పంచాంగ శ్రవణం
దూరదర్శన్ లో ‘ది కేరళ స్టోరీ’, రెచ్చగొట్టే చర్యంటూ కమ్యూనిస్టులు అక్కసు...!
తిరుమలలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న ఒంటిమిట్ట.. భద్రాద్రిలో పసుపు దంచుడు, తలంబ్రాల పనులు
మహాశివరాత్రి సంబరాలు: ఆదిదంపతుల కళ్యాణంతో పరవశించిన శ్రీగిరి
శ్రీనివాసమంగాపురంలో రథోత్సవం, కపిలతీర్థంలో కల్పవృక్ష సేవ
ఇంద్రకీలాద్రి పై శివరాత్రి శోభ: మార్చి8న కళ్యాణం, 9న రథోత్సవం
గ్రంథాలయ ఉద్యమకర్త గాడిచెర్ల హరి సర్వోత్తమరావు
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు
తెల్లదొరలను ఎదిరించిన తొలితరం వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
మెగా డీఎస్సీ కోసం ‘చలో సెక్రటేరియట్’... పోలీసుల అదుపులో పీసీసీ చీఫ్ షర్మిల
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 7న ఫలితాలు..!