వైసీపీ
ప్రభుత్వ విధానాలతో యువత తీవ్రంగా నష్టపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి అన్నారు. నాలుగేళ్ళగా డీఎస్సీ వేయకపోవడంతో ఉద్యోగార్థులకు తీరని
అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించిన
పురందరేశ్వరి, మొవ్వ మండలం కాజ గ్రామంలో ‘ పల్లెకు పోదాం’ కార్యక్రమం లో పాల్గొన్నారు.
అక్కడ బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన పురందరేశ్వరి, పార్టీ బలోపేతం పై శ్రేణులకు
దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయం,
అనుబంధ రంగాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఆక్వా రంగానికి రూపాయిన్నర కే యూనిట్ విద్యుత్ ఇస్తామని ఎన్నికల వేళ జగన్ హామీ
ఇచ్చి ఇప్పుడు యూనిట్ కు రూ. 6 వసూలు చేయడం దారుణమన్నారు.
ఆంధ్రప్రదేశ్
లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర నిధులతోనే అమలవుతున్నాయన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, 8 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారన్నారు. నిమ్మకూరు లో బెల్
కంపెనీ ఏర్పాటుతో మేలు జరిగిందన్నారు. రానున్న
ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.