Sunday, May 05, 2024

Logo
Loading...
google-add

కేంద్ర నిధులను దారి మళ్ళించిన వైసీపీ ప్రభుత్వం : కేంద్రమంత్రి పీయూష్ గోయల్

T Ramesh | 16:24 PM, Thu Apr 25, 2024

వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించడంతో పాటు రైతులు, శ్రామికులు, యువత సంక్షేమాన్ని పట్టించుకోలేదని  కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియా పేరిట కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన పీయూష్ గోయల్, అమరావతిలో  టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎన్డీయే కూటమి తరఫున ఉమ్మడి మేనిఫెస్టో, రాజకీయ ప్రచారం తదితర అంశాలపై సమాలోచనలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్, ప్రధాని ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్ళను మోదీ. ఏపీకి కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3.5 లక్షల ఇళ్ళనే నిర్మాణం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారిమళ్ళించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అనేక ప్రాజెక్టులలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని విమర్శించారు.

రైల్వే ప్రాజక్టులకు అవసరమైన భూములను జగన్ ప్రభుత్వం కేటాయించలేదన్న కేంద్రమంత్రి, ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుందన్నారు.   ఏపీలో కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో సహజవనరులు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు.

google-add
google-add
google-add

ముఖ్యాంశాలు

Badi Baat

google-add

అంతర్జాతీయం

google-add
google-add