రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
T Ramesh | 17:58 PM, Thu May 02, 2024
ఆంధ్రప్రదేశ్ లో 4.14 మంది ఓటర్లు : సీఈవో ఎంకే మీనా
T Ramesh | 16:59 PM, Thu May 02, 2024
మన ప్రధానమంత్రులు : పండిత జవహర్లాల్ నెహ్రూ : 2
P Phaneendra | 16:41 PM, Thu May 02, 2024
ఎస్పీ కంచుకోటలో బుల్డోజర్లతో బీజేపీ ర్యాలీ
T Ramesh | 16:39 PM, Thu May 02, 2024
జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ పై లుకౌట్ నోటీసు జారీ
T Ramesh | 15:57 PM, Thu May 02, 2024
గుజరాత్ పర్యటనలో కాంగ్రెస్ పై మోదీ విమర్శలు
T Ramesh | 14:52 PM, Thu May 02, 2024
లోక్సభలో మన స్థానాలు : మచిలీపట్నం
P Phaneendra | 14:44 PM, Thu May 02, 2024
పెనమలూరులో జోగి వెర్సెస్ బోడె
P Phaneendra | 14:21 PM, Thu May 02, 2024
పామర్రు కిరీటం కుమారరాజాకు అందుతుందా?
P Phaneendra | 13:56 PM, Thu May 02, 2024
అవనిగడ్డలో మండలి జనసేన పతాకం ఎగరేసేనా?
P Phaneendra | 13:34 PM, Thu May 02, 2024
మచిలీపట్నంలో బందరు లడ్డూ ఎవరికి?
P Phaneendra | 13:30 PM, Thu May 02, 2024
లోక్సభలో తమిళ రాజకీయం ఎలా ఉండబోతోంది?
Tamil Nadu to face polling in first phase for Lok Sabha elections
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. అంటే ఆ దశలో ఎన్నికలు జరిగే 102 నియోజక వర్గాల్లో ప్రచారం రేపు బుధవారం సాయంత్రం ముగుస్తుంది. ఈ దశలో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగబోతోంది. వాటన్నింటిలోనూ ఎక్కువ స్థానాల్లో పోలింగ్ జరిగేది తమిళనాడులోనే. ఆ రాష్ట్రంలో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటన్నిటికీ వచ్చే శుక్రవారం నాడే పోలింగ్ జరుగుతుంది. ఆ నేపథ్యంలో తమిళ రాజకీయం ఎలా ఉండబోతోందో ఒకసారి పరిశీలిద్దాం.
తమిళనాడులో ఈసారి ప్రధానంగా మూడు కూటముల మధ్య ఎన్నికల పోరు జరగనుంది.
ఇండీ కూటమిలో ద్రవిడ మున్నేట్ర కళగం-డిఎంకె 21 సీట్లలో అభ్యర్ధులను మోహరించింది. కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి-కెఎండికె 1 స్థానంలో డిఎంకె గుర్తుతోనే బరిలోకి దిగుతోంది. భారత జాతీయ కాంగ్రెస్ 9 సీట్లలో, సిపిఐ 2, సిపిఐ(ఎం) 2, విడుదలై చిరుత్తైగల్ కచ్చి-విసికె 2, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 1, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం-ఎండిఎంకె 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి.
అన్నాడీఎంకే కూటమిలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం-ఎఐఎడిఎంకె 32 సీట్లలో పోటీ చేస్తోంది. పుదియ తమిళగం పార్టీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చెరో స్థానంలో అన్నాడిఎంకె గుర్తుతోనే పోటీ పడుతున్నాయి. దేశీయ మర్పోక్కు ద్రవిడ కళగం-డిఎండికె 5 స్థానాల్లో బరిలో నిలుస్తోంది.
ఇక ఎన్డిఎ కూటమిలో భారతీయ జనతా పార్టీ-బిజెపి 19 స్థానాల్లో బరిలో నిలబడుతోంది. ఇందీయ జననాయగ కచ్చి-ఐజెకె, ఇందీయ మక్కల్ కల్వి మున్నేట్ర కళగం-ఐఎంకెఎంకె, పుదియ నీది కచ్చి-పిఎన్కె, తమిళగ మక్కల్ మున్నేట్ర కళగం-టిఎంఎంకె తలా ఒక స్థానంలో బిజెపి గుర్తు మీద పోటీపడతాయి. అన్బుమణి రాందాస్కు చెందిన పట్టాళి మక్కల్ కచ్చి-పిఎంకె 10 సీట్లలో పోటీ పడుతోంది. తమిళ మానిల కాంగ్రెస్-టిఎంసి 3, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం-ఎఎంఎంకె 2 చోట్ల, అన్నాడిఎంకె నుంచి బహిష్కృతుడైన ఒ పనీర్ సెల్వం స్వతంత్ర అభ్యర్ధిగా 1 స్థానంలో పోటీ చేస్తున్నాయి.
2014 పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడిఎంకె విజయభేరి మోగించింది. జయలలిత నేతృత్వంలో ఆ పార్టీ మొత్తం 37 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలు బిజెపి 1 సీటు, పిఎంకె 1 సీటు గెలుచుకున్నాయి. ఇక కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె ఒక్కటంటే ఒక్క స్థానంలోనైనా విజయం సాధించలేకపోయింది.
2019 లోక్సభ ఎన్నికల నాటికి జయలలిత, కరుణానిధి ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. అప్పటి ఎన్నికల్లో యుపిఎ కూటమి 37 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డిఎ కూటమిలో అన్నాడిఎంకె ఒకే ఒక స్థానంలో గెలిచింది.
2024లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇండీ కూటమే గెలుస్తుందని అత్యధిక సర్వేలు చెబుతున్నాయి. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఇండీ కూటమి 30-36 సీట్లు, అన్నాడిఎంకె 3-6 సీట్లు, ఎన్డిఎ కూటమి గరిష్టంగా 1 సీటు, ఇతరులు గరిష్టంగా 2 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. పుదియ తలైమురై సర్వే అంచనా ప్రకారం ఇండీ కూటమి 29-31, అన్నాడిఎంకె 4-6, ఎన్డిఎ 4-6, ఇతరులు గరిష్టంగా 2 స్థానాలు గెలుచుకోవచ్చు. ఇండియా టుడే, ఎబిపి న్యూస్ సర్వేలు మొత్తం 39 స్థానాల్లోనూ ఇండీ కూటమి అభ్యర్ధులే గెలుస్తారని అంచనా వేస్తున్నాయి. ఇండియా టివి సర్వే ఇండీ కూటమి 26, అన్నాడిఎంకె 4, ఎన్డిఎ కూటమి 4, ఇతరులు 5 స్థానాలు గెలుస్తాయని అంచనా వేసింది.
అయితే తమిళనాడులో బీజేపీకి కొత్తఊపు తెచ్చిన అన్నామలై, తమ కూటమి రెండంకెల స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని, మిగతా స్థానాల్లో రెండో స్థానంలో నిలుస్తామనీ చెబుతున్నారు. ఈ ఎన్నికలతో అన్నాడిఎంకె రాష్ట్రం నుంచి కనుమరుగవుతుందని, ఆ ఖాళీని బిజెపి పూరిస్తుందనీ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Trending Tag
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
రాజస్థాన్లోని జలౌర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
ఇజ్రాయెల్ –పాలస్తీనా యుద్ధంపై మరోసారి స్పందించిన భారత్
చైనాలో కుంగిన నేషనల్ హైవే, 19 మంది మృతి
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండాలు
మహారాష్ట్ర నుంచి ఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతి
అమెరికాలో టోర్నడోల బీభత్సం
డ్రాగన్ కవ్వింపులు, పీవోకేలో రోడ్డు నిర్మాణం
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మరోసారి ప్రతిపాదనలు
అమెరికాలో కారు ప్రమాదం, ముగ్గురు భారతీయులు మృతి
ఎర్ర సముద్రంలో భారత్కు వస్తున్న నౌకపై దాడి
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు