ఉరవకొండ ఎవరి హస్తగతం అవుతుంది...?
T Ramesh | 17:00 PM, Tue May 07, 2024
రాయదుర్గం పీఠం శ్రీనివాసుడిదా, గోవిందుడిదా...?
T Ramesh | 16:32 PM, Tue May 07, 2024
అనంతపురం లోక్ సభ లో ‘నారాయణ వెర్సెస్ నారాయణ’
T Ramesh | 15:30 PM, Tue May 07, 2024
మన ప్రధానమంత్రులు : పీవీ నరసింహారావు
P Phaneendra | 15:05 PM, Tue May 07, 2024
డోన్లో అందరూ డాన్లే : గెలిచేది ఎవరు?
K Venkateswa... | 14:18 PM, Tue May 07, 2024
పాణ్యంలో అందరూ పెద్దలే : గెలిచేది ఎవరు?
K Venkateswa... | 14:09 PM, Tue May 07, 2024
బనగానపల్లి ప్రజాతీర్పు ఎవరి వైపు?
K Venkateswa... | 14:03 PM, Tue May 07, 2024
నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?
K Venkateswa... | 13:59 PM, Tue May 07, 2024
శ్రీశైలం మల్లన్న ఎవరిని కరుణిస్తారు?
K Venkateswa... | 13:41 PM, Tue May 07, 2024
రఫా క్రాసింగ్ ను ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్
T Ramesh | 13:39 PM, Tue May 07, 2024
ఆళ్లగడ్డ : ఎవరి అడ్డా
K Venkateswa... | 13:35 PM, Tue May 07, 2024
టీడీపీకి ‘యనమల’ గుడ్ బై, వైసీపీని వీడిన డొక్కా
ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆయారాం, గయారాంల హడావుడి అంతా ఇంతా కాదు. అప్పటి వరకు తాము ఉన్న పార్టీని వేనోళ్ళ పొగిడిన నేతలు టికెట్ దక్కలేదని కొందరు, ప్రాధాన్యంలేదని మరికొందరు పార్టీలు వీడుతున్నారు. అప్పటివరకు తిట్టిన పార్టీలోకే పొలోమని చేరుతున్నారు.
తాజాగా టీడీపీ అగ్రనేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు పార్టీ మారారు. గత రెండు దఫాలుగా సైకిల్ గుర్తుపై అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన కృష్ణుడికి ఈ సారి టీడీపీ టికెట్ దక్కలేదు. యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య ఈసారి పోటీలో ఉన్నారు. దీంతో యనమల కృష్ణుడు పార్టీ మారారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేసి టికెట్ దక్కకుండా కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.సీఎం జగన్ ఆహ్వానం మేరకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తునిలో వైసీపీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తానని చెప్పారు.
ఇక మాజీమంత్రి, గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని వీడారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(రిజర్వుడు) స్థానం నుంచి సైకిల్ గుర్తు పై పోటీ చేసిన మాణిక్య వరప్రసాద్, వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటన సమయంలో టీడీపీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు. తాడికొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది.
తాడికొండ నుంచి ఫ్యాన్ గుర్తుపై మాజీ మంత్రి సుచరిత పోటీ చేస్తున్నారు. దీంతో తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ మాణిక్య వరప్రసాద్ కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రి వర్గంలో డొక్కా మాణిక్య ప్రసాద్ పనిచేశారు.
రాజమహేద్రవరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్ దౌర్హరాలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగం లైవ్
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
తెలంగాణ జహీరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రెస్మీట్ లైవ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ లైవ్
బిహార్లోని ముంగెర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అంబాలాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఛత్తీస్గఢ్లోని జంజగిర్ చంపాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం లైవ్
నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?
భారతీయ ముస్లింలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి: మోదీ
నిజ్జర్ హత్యలో అనుమానితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
నిజ్జర్ హత్య కేసులో అరెస్టైన వారికి పాక్ ఐఎస్ఐతో లింకులు
కేంద్ర మధ్యంతర బడ్జెట్పై ప్రత్యేక విశ్లేషణ
మంగళము కుసుమ సుకుమారునకు....
అయోధ్య రామయ్య కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వసంవాదకేంద్రం ప్రత్యేక గీతం
రాష్ట్రంలోని వైష్ణవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి
తేజస్లో మోదీ
వరల్డ్ కప్ చేజారిన నిరాశలో ఉన్న భారత జట్టుకు ప్రధాని మోదీ సాంత్వన పలికారు
రామమందిరం గురించి ప్రముఖ నాట్యకళాకారిణి సోనాల్ మాన్సింగ్
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికీ, కేరళ పేలుళ్ళకూ సంబంధం ఏంటి?
ఆసియా పారా గేమ్స్లో పాల్గొన్న భారత బృందాన్ని ప్రశంసిస్తున్న ప్రధానమంత్రి
నంద్యాల : వైసీపీ నిలుపుకుంటుందా? టీడీపీ గెలుచుకుంటుందా?