కృష్ణాజలాల
వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కృష్ణా
నదీ యాజమాన్య బోర్డు (KRMB) ట్రైబ్యునల్ హైదరాబాదులో కీలక
సమావేశం నిర్వహించింది. వేసవిలో నీటి కేటాయింపుల గురించి సమావేశంలో చర్చించింది.
నాగార్జునసాగర్
ప్రాజెక్టులో ఉన్న 14 టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది.
తెలంగాణకు
అత్యధికంగా 8.5 టీఎంసీలు కేటాయించిన కేఆర్ఎంబీ, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీల నీటిని సర్దుబాటు చేసింది. మే లో
మరోసారి సమావేశం కావాలని ఇవాళ్టి భేటీలో కేఆర్ఎంబీ నిర్ణయించింది.
గత
అక్టోబరులో సమావేశమైన కేఆర్ఎంబీ ట్రైబ్యునల్ నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ ల నీటి నిల్వలు, కేటాయింపులను సమీక్షించింది. రెండు
జలాశయాల్లో 82కి పైగా టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్టు గుర్తించ, ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీల వాటాను
కేటాయించింది.