ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అరుణాచల్ప్రదేశ్
పర్యటనపై చైనా అక్కసుకు భారత్ విదేశాంగా శాఖ అధికారులు దీటుగా బదులిచ్చారు.
ప్రధాని మోదీ అరుణాచల్ పర్యటనపై చైనా
వ్యాఖ్యలను ఖండించిన విదేశాంగ శాఖ, భారత్లోని
ఇతర రాష్ట్రాల్లో పర్యటించినట్లే అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నామన్నారు. అరుణాచల్
ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని చైనాకు ఇప్పటికే పలుసార్లు స్పష్టం
చేశామన్నారు. చైనా అక్కసు వెళ్ళగక్కినంతమాత్రాన వాస్తవాలు మారవని విదేశాంగ శాఖ
అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చురకలు అంటించారు.
‘జాంగ్నన్’ ప్రాంతం తమ భూభాగమని వితండవాదం
చేస్తోన్న చైనా అక్కడ భారత్ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత
క్లిష్టతరం చేస్తాయని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్
నోరుపారేసుకున్నారు.
అరుణాచల్లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటించి
పలు అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితమిచ్చారు. చైనా- భారత్ సరిహద్దులో ‘సేలా’
సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. దీని ద్వారా సైనికబలగాల రాకపోకలు సులువు అవుతాయి.
అయితే, అరుణాచల్ ప్రదేశ్ ను చైనా
‘జాంగ్నన్ ను దక్షిణ టిబెట్గా పేర్కొంటోంది.