ప్రవాస
భారతీయులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు
వెళ్లనున్న ప్రధాని మోదీ, సోషల్ మీడియా వేదికగా ప్రవాసభారతీయుల సేవలను కొనియాడారు.
ప్రపంచ
దేశాలతో భారత్ సంబంధాలను మరింత పటిష్ఠం చేసేలా ప్రవాసులు కృషి చేయడం గర్వంగా
ఉందన్నారు.
అబుదాబి పర్యటనలో భాంగా అహ్లాన్
మోదీ కార్యక్రమంలో పాల్గొని ప్రశంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అబుదాబిలో
స్థిరపడిన ప్రవాసులు పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు.
పర్యటనలో
భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో మోదీ భేటీ
కానున్నారు. అనంతరం అబుదాబిలో నూతనంగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఖతార్ పర్యటనకు వెళతారు.
మరో ట్వీట్ సౌర విద్యుత్ పథకం గురించి వివరించారు. సౌర
విద్యుత్ వినియోగాన్ని ప్రొత్సహించే దిశగా కేంద్ర
ప్రభుత్వం ముందడుగు వేసింది. కోటి
ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు గాను ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని
ప్రారంభించింది. ఇందుకోసం pmsuryaghar.gov.inలో
దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని ప్రధాని మోదీ మోదీ, ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రూ.75 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ప్రతీనెలా
300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను
అందించి, కోటి కుటుంబాల్లో వెలుగులు నింపుతామని ట్వీట్ లో మోదీ తెలిపారు. క్షేత్రస్థాయిలో
ఈ పథకానికి ప్రచారం కోసం పట్టణ స్థానిక
సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రధాని
తెలిపారు. ఈ పథకంతో విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన
జరుగుతుందని తెలిపారు.