బ్రిటన్
రాజు ఛార్లెస్ -3(75) కి కేన్సర్ సోకినట్లు నిర్ధారణ జరిగింది. ఈ మేరకు బకింగ్
హోమ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కింగ్
ఛార్లెస్ కు ప్రొస్టేట్ గ్రంధికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తుండగా కేన్సర్ బయటపడినట్లు
ప్రకటనలో పేర్కొన్న
ప్రకటనలో
వివరించారు. సోమవారం నుంచే ఆయనకు చికిత్స అందజేస్తున్నట్లు, త్వరలోనే సాధారణ
విధుల్లోకి వస్తారని పేర్కొంది.
ప్రస్తుతం ఆయన హాజరు కావాల్సిన కార్యక్రమాల్లో రాజకుటుంబానికి
చెందిన సీనియర్ వ్యక్తులు, కింగ్ ఛార్లెస్ తరఫున పాల్గొంటున్నారు.
2022
సెప్టెంబరు లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ -2, 96 ఏళ్ళ వయస్సులో కన్నుమూశారు. దీంతో
ఛార్లెస్ -3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు.
ఛార్లెస్
-3 కేన్సర్ బారిన పడటంపై పలువురు దేశాధినేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని
ఆకాంక్షించారు.
ఛార్లెస్ -3 సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని బ్రిటన్ ప్రధాని
రుషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత
ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఛార్లెస్ -3 త్వరగా
కోలుకోవాని, సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆకాంక్షిస్తున్న భారతీయుల్లో తాను కూడా ఒకడినని
మోదీ అన్నారు.