వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. ఫాస్టాగ్ కేవైసీ గడువు మరో నెల రోజుల పాటు పెంచింది.జనవరి 31తో గడువు ముగియగా, తాజాగా దాన్ని ఫిబ్రవరి 29 వరకు పెంచారు. గడువులోగా కేవైసీ (fastag kyc date extended) చేయకపోతే ఫాస్టాగ్ డీ యాక్టివేట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఫాస్టాగ్ సైట్తోపాటు, నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వెబ్ ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చని కేంద్ర ఉపరితల రవాణాశాఖ ప్రకటించింది.
ఫాస్టాగ్ కేవైసీ ఎలా చేయాలి…
*ఫాస్టాగ్ వెబ్సైట్ లింక్పై క్లిక్ చేయాలి
*మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లాగిన్ అవ్వాలి
*డాష్బోర్డులో మై ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. స్టేటస్ కనిపిస్తుంది
*మొబైల్ నంబరు రిజిస్టర్ కాకుంటే..యాప్ డౌన్లోడ్ చేసుకుని నంబరు రిజిస్టర్ చేసుకోవాలి
*బ్యాంకులు జారీ చేసినవి అయితే, బ్రాంచ్కు వెళ్లి నంబరు రిజిస్టర్ చేసుకోవాలి.
*చివరగా కైవైసీ పూర్తి చేయాలి.