100
Dignitaries From 55 Nations
అయోధ్య
రామమందిర ప్రారంభోత్సవానికి 55 దేశాలకు చెందిన 110 మంది ప్రముఖులను శ్రీరామ
జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. వీరిలో ఆయా దేశాల అధినేతలతో పాటు రాయబారులు,
ఎంపీలు కూడా ఉన్నారు.
వరల్డ్ హిందూ ఫౌండేషన్ చైర్మన్ స్వామి విజయానంద ఈ విషయాన్ని
వెల్లడించారు. రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని
అతిథులను కోరినట్లు చెప్పారు. విదేశీ అతిథులంతా జనవరి 20నే లక్నో చేరుకుంటారని
అక్కడి నుంచి 21 సాయంత్రానికి అయోధ్య చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
పొగమంచు,వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభించినందున అతిథులంతా షెడ్యూల్ కంటే
ముందుగానే అయోధ్య చేరుకోవడం ఉత్తమమని సూచించినట్లు తెలిపారు.
రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో
పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రముఖనటి హేమమాలినితో
నృత్య ప్రదర్శన కూడా ఇవ్వనున్నారు. రామాయణం ఆధారంగా ఉండే నృత్యరూపకాలన్ని
ప్రదర్శించే అవకాశం తనకు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు హేమమాలిని తెలిపారు.