ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం, వారి సర్వీస్ నిబంధనలపై కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన చట్టంపై సుప్రీంకోర్టు స్టే (supreme court) విధించేందుకు నిరాకరించింది.తాజాగా ఈసీ నియామకాలపై కేంద్రం తీసుకొచ్చిన చట్టం కొట్టివేయాలంటూ కొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు నెలల్లో సమాధానం ఇవ్వాలని నోటీస్లులో సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది.
కొత్త చట్టం రాకముందు ఈసీ, సీఈసీలను ప్రభుత్వ సిఫారసులతో రాష్ట్రపతి నియమించేవారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆ బాధ్యతలను సెర్చ్, ఎంపిక కమిటీలు నిర్వహించాల్సి ఉంటుంది. సెర్చ్, ఎంపిక కమిటీలను కేంద్రం నియంత్రించేలా ఉందని స్టే విధించాలంటూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, న్యాయవాది
గోపాల్ సింగ్ సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు, కేంద్రం వాదనలు వినకుండా స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.