వన్డే ప్రపంచకప్ను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 102 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
క్వింటన్ డికాక్ (100), వాన్ డెర్
డస్సెన్ (108) ఐడెన్ మార్క్రమ్ (106) సెంచరీలతో, మొదట బ్యాటింగ్
చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ
స్కోరు సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఈ భారీ లక్ష్యఛేదనలో
శ్రీలంక 44.5 ఓవర్లకు 326 పరుగులు చేసి ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (76), చరిత్ అసలంక (79), డాసున్ శనక (68) రాణించారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో
శ్రీలంకకు మొదట్లోనే షాక్ తగిలింది. రెండో
ఓవర్లో పాథుమ్ నిశాంక (0) క్లీన్బౌల్డ్ అయాడు. వన్డౌన్ బ్యాటర్
కుశాల్ మెండిస్ మాత్రం సౌతాఫ్రికా బౌలర్లపై రెచ్చిపోయాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసాడు. ఎట్టకేలకు మెండిస్ను రబాడ ఔట్ చేసాడు. కాసేపటికే సమరవిక్రమ (23) కూడా ఔట్ అవడంతో శ్రీలంక 111 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. చరిత్ అసలంక నిలకడగా ఆడడంతో 20 ఓవర్లకు స్కోరు 150కి చేరింది.ధనంజయ డిసిల్వా 11 పరుగులకేఔటయ్యాడు.
శనక, అసలంక ఆరో వికెట్కు 82 పరుగులు చేసారు.అసలంకను ఎంగిడి ఔట్ చేసాడు. తర్వాతి ఓవర్లోనే
వెల్లలాగె ఔట్ అయిపోయాడు. దూకుడుగా ఆడుతున్న శనకను మహారాజ్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక గెలుపు ఆశలు
సన్నగిల్లాయి. చిివర్లో కాసున్ రజిత (33)
ఫర్వాలేదనిపించాడు.