చైనాలోని
హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మెన్స్ హాకీ జట్టు
బోణీకొట్టింది. తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్థాన్ పై 16-0 తేడాతో ఘన విజయం సాధించింది.
లలిత్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్ నాలుగేసి గోల్స్ చేయగా, మన్దీప్ సింగ్ హ్యాట్రిక్
గోల్స్ చేయడంతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఆట తొలి క్వార్టర్ లో లలిత్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్ చెరో గోల్ చేశారు. ప్రత్యర్థి
ఉజ్బెకిస్థాన్ ఒక్క గోల్ కూడా చేయలేదు. రెండో క్వార్టర్ ప్రారంభంకాగానే అభిషేక్, లలిత్, మన్దీప్ సింగ్
ఒక్కో గోల్ చేశారు. దీంతో స్కోర్ 5-0కు చేరింది. రెండో క్వార్టర్ ముగిసే సమయానికి
మన్దీప్ మరో రెండు గోల్స్ చేశారు.
మూడో
క్వార్టర్ భారత ఆటగాళ్ళు వరుణ్ కుమార్, సుఖ్జీత్, అమిత్ రోహిదాస్ వెంటవెంటనే మూడు
గోల్స్ చేశారు. దాంతో జట్టు స్కోర్ 10-0కు చేరింది. అనంతరం సుఖ్జీత్, లలిత్, చెరో
గోల్ చేశారు.
నాలుగో
క్వార్టర్లో వరుణ్ కుమార్ నాలుగో గోల్ చేయగా, లలిత్ కూడా నాలుగో గోల్ కొట్టారు.
అనంతరం మరో రెండు గోల్స్ చేయడంతో భారత్ 16-0తో ఉజ్బికెస్థాన్ను ఓడించింది. తర్వాతి
మ్యాచ్లో భాగంగా సింగపూర్తో తలపడనుంది.