ఆస్రేలియాతో
మూడు మ్యాచ్ల సీరీస్లో భాగంగా తొలి వన్డేలో విజయంతో జోరుమీదున్న భారత జట్టు,
ఇవాళ జరిగే పోరులో జోరు కొనసాగించాలని చూస్తుంటే.. ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలవాలనే కసితో కంగారూ జట్టు
తహతహలాడుతోంది.
మొదటి
వన్డేలో కీలక ఆటగాళ్ళు విశ్రాంతి తీసుకున్నప్పటికీ భారత్ అలవోకగా విజయం
సాధించింది.
రెండో వన్డేకు కూడా దాదాపు అదే జట్టును లేదా స్వల్పమార్పులతో
మైదానంలోకి పంపనున్నారు. మూడో వన్డే సమయానికి రోహిత్, విరాట్, కుల్దీప్, హార్దిక్
తిరిగి జట్టులో చేరనున్నారు.
ఇందడోర్
వేదికగా మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు రెండో వన్డే ప్రారంభం కానుంది. ఆకాశం మేఘావృత్తమై
ఉన్నప్పటికీ వాన కురిసే అవకాశం చాలా తక్కువే.
సాధారణంగా ఇండోర్ పిచ్ బ్యాంటింగ్ కు
అనుకూలమని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. బౌండరీ లైన్లు కూడా చిన్నవి కావడంతో
స్పిన్నర్లకు కఠినకాలమనే చెప్పొచ్చు.
శుభమన్
గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్
కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, అశ్విన్, షమీ, బుమ్రాకు ఇవాళ
జరిగే మ్యాచ్ లో చోటు దక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.