ఐసీసీ
వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్
నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. బాబర్
ఆజమ్ జట్టుకు సారథ్యం వహించనుండగా, ఆసియా కప్ మధ్యలో వైదొలిగిన పేసర్ హ్యారీస్
రవూఫ్ చోటు దక్కించుకున్నారు.
రవూఫ్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు పీసీబీ
సెలెక్షన్ కమిటీ తెలిపింది.
పాక్
టాప్ ఆర్డర్ లో బాబర్ అజామ్తో పాటు ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్,
ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ ఆఘాలకు చోటు దక్కింది.
భారత్
లో స్పిన్ పిచ్లను దృష్టిలో పెట్టుకుని షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, సల్మాన్ ఆఘా,
ఇఫ్తికార్ అహ్మద్ వంటి స్పిన్ ఆల్ రౌండర్లకు చోటు కల్పించినట్లు క్రికెట్ నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.
రిజర్వ్
జాబితాలో మహ్మద్ హ్యారిస్, జమాన్ ఖాన్, అర్బర్ అహ్మద్ లకు చోటు దక్కదింది.
అక్టోబర్ 6న హైదరాబాద్
వేదికగా నెదర్లాండ్స్ తో పాకిస్తాన్
తొలి మ్యాచ్ ఆడనుంది.
ప్రస్తుతం తాము ప్రకటించిన జట్టు
వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుందనే నమ్మకం ఉందని చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్
అన్నారు. 1992లో ప్రపంచ్ కప్ ను సొంతం
చేసుకున్న పాకిస్తాన్ టీమ్, మరోసారి సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతోంది.
ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టు.. ఫకార్
జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్,
సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, షాదబ్ ఖాన్, ఉసమా మిర్, మహ్మద్
నవాజ్, షాహీన్ షా ఆఫ్రీదీ, హారీస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ.
ట్రావిలింగ్ రిజర్వు ప్లేయర్లు ..
అబ్రర్ అహ్మద్, జమాన్ ఖాన్, మహ్మద్ హారీస్