Friday, May 10, 2024

Logo
Loading...
upload upload upload

special observers

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం : ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు సీఈసీ ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. సాధారణ ఎన్నికల పరిశీలకుడిగా రామ్‌మోహన్ మిశ్రా, పోలీసు శాఖ వ్యవహారాల పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ఎన్నికల ఖర్చుల పరిశీలకుడిగా నినా నిగమ్‌ను నియమిస్తూ సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.



తాజాగా నియమించిన పరిశీలకులు వచ్చే వారం నుంచి ఏపీలో పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో హింసకు తావులేకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

K Venkateswara Rao | 14:19 PM, Thu Mar 28, 2024
upload
upload