‘అంబానీ-అదానీల మీద రాత్రికిరాత్రి మూగపోయారేం?’
P Phaneendra | 18:01 PM, Wed May 08, 2024
బ్రహ్మానందం ప్రధానపాత్రలో ‘బ్రహ్మా-ఆనందం’ సినిమా
P Phaneendra | 17:55 PM, Wed May 08, 2024
పెనుకొండ ఎవరికి అండ ...!
T Ramesh | 17:20 PM, Wed May 08, 2024
వైసీపీ VS బీజేపీ : గరంగరంగా ధర్మవరం రాజకీయం
T Ramesh | 17:11 PM, Wed May 08, 2024
మడకశిరలో లోకల్ వెర్సెస్ నాన్ లోకల్...!
T Ramesh | 15:33 PM, Wed May 08, 2024
భారతీయుల ఒంటిరంగుపై శాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, నరేంద్రమోదీ మండిపాటు
P Phaneendra | 15:22 PM, Wed May 08, 2024
పుట్టపర్తిలో హోరాహోరీ
T Ramesh | 14:11 PM, Wed May 08, 2024
కదిరి నరసింహుడా, కాటమరాయుడా
T Ramesh | 14:05 PM, Wed May 08, 2024
హిందూపూర్ లో అన్స్టాపబుల్ బాలయ్యకు స్వామి పరిపూర్ణానంద సవాల్
T Ramesh | 13:59 PM, Wed May 08, 2024
రాప్తాడు రేస్ లో నిలిచెదెవరు...?
T Ramesh | 13:51 PM, Wed May 08, 2024
ఆంధ్రా పాలిటెక్నిక్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల
P Phaneendra | 13:46 PM, Wed May 08, 2024
‘సిద్ధం’ పేరిట అసత్యాలు ప్రచారం : వైసీపీ తీరుపై బీజేపీ ఆగ్రహం
వైసీపీ అధినేత సీఎం జగన్, సిద్ధం సభల పేరిట అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లక్ష మందితో సభ నిర్వహించాలని వైసీపీ భావిస్తే 30 వేల మంది కూడా రావడం లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం ఎద్దేవా చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
విజయవాడలో గతంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే జగన్ ఏం చర్యలు తీసుకున్నారని నాగభూషణం ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే పురందరేశ్వరి, చంద్రబాబు పై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నాశనం అవడానికి జగన్ ప్రధాన కారణమని విమర్శించిన నాగభూషణం దీనిపై ఎవరైనా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తేలడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఆదోని బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్ధసారధి అన్నారు. గత ఎన్నికల సమయంలో 125 హామీలు ఇచ్చిన జగన్, ఎన్నింటిని నెరవేర్చాలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పగలరా అని దుయ్యబట్టారు. గతంలో 151 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే జగన్ చేసిన నిర్వాహకం చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈ సారి 15 సీట్లలో కూడా వైసీపీ గెలవలేదని జోస్యం చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో రికార్డు సృష్టించడం ఖాయమన్నారు.