K Venkateswara Rao

K Venkateswara Rao

టి 20 : నేపాల్‌ను చిత్తుచేసి సూపర్ 8లో ప్రవేశించిన బంగ్లాదేశ్

టి 20 : నేపాల్‌ను చిత్తుచేసి సూపర్ 8లో ప్రవేశించిన బంగ్లాదేశ్

టీ20 లీగ్ దశ ముగియనుంది. తాజాగా నేపాల్ జట్టుపై బంగ్లాదేశ్ విజయం సాధించి సూపర్ 8లో ప్రవేశించింది. గ్రూప్ డిలో సూపర్ 8లో ప్రవేశించిన రెండో జట్టుగా...

రఫాలో పగటిపూట కాల్పుల విరమణ

రఫాలో పగటిపూట కాల్పుల విరమణ

ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనాలోని రఫాలో పగటిపూట కాల్పుల విమరణ ప్రకటించింది. రఫాలో 12 కిలోమీటర్ల పరిధిలో లక్షలాది మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు....

మాజీ మంత్రి ఇంటిపై రాళ్లదాడి

మాజీ మంత్రి ఇంటిపై రాళ్లదాడి

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్‌కు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఇంటిపై ఆదివారం...

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు : నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగింత

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు : నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగింత

ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్యకు సుఫారీ ఇచ్చాడనే ఆరోపణలపై భారత సంతతి వ్యక్తి నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అమెరికాకు అప్పగించింది. కొన్ని నెలల కిందట చెక్...

కోటాలో మరో విద్యార్థి దుర్మరణం

కోటాలో మరో విద్యార్థి దుర్మరణం

విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోటాలో తాజాగా బిహార్‌కు చెందిన ఆయుష్ జైస్వాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐఐటీ జేఈఈ కోచింగ్ కోసం బిహార్ నుంచి వచ్చి కోటాలోని...

జమ్ము కశ్మీర్ ఉగ్రదాడులపై హోం మంత్రి కీలక సమీక్ష

జమ్ము కశ్మీర్ ఉగ్రదాడులపై హోం మంత్రి కీలక సమీక్ష

జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రధానిగా నరేంద్ర...

రెండు దెబ్బలే కొట్టాను : తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు : దర్శన్

రెండు దెబ్బలే కొట్టాను : తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు : దర్శన్

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. రేణుకా స్వామిని తన అనుచరులు బెంగళూరులోని ఓ షెడ్డుకు తీసుకువచ్చారని, తన భార్యకు అసభ్యకర ఫోటోలు, వీడియోలు పంపాడని,...

భారత్‌తో కలసి పనిచేస్తాం : కెనడా ప్రధాని

భారత్‌తో కలసి పనిచేస్తాం : కెనడా ప్రధాని

ముఖ్యమైన విషయాల్లో కలసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. జీ7 దేశాల సమావేశాల్లో ప్రధాని మోదీతో ట్రూడో చర్చలు జరిపారు....

దర్జా దొంగ : సూటు బూటు విమాన ప్రయాణీకులే టార్గెట్

దర్జా దొంగ : సూటు బూటు విమాన ప్రయాణీకులే టార్గెట్

దొంగలు తెలివిమీరిపోయారు. తాళాలు వేసి ఉండే ఇళ్లకు కన్నాలు వేసే వారి గురించి విన్నాం. కాని విమానాల్లో మాత్రమే తిరుగుతూ విమాన ప్రయాణీకులే లక్ష్యంగా దొంగతనాలు చేస్తోన్న...

నీట్ పేపర్ లీక్ : బలపడుతోన్న అనుమానాలు

నీట్ పేపర్ లీక్ : బలపడుతోన్న అనుమానాలు

వైద్య విద్యలో ప్రవేశానికి దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షా పత్రాల లీక్‌పై అనుమానాలు బలపడుతున్నాయి. బిహార్ కేంద్రంలో నీట్ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అనుమానిస్తున్నారు. నీట్ ప్రశ్నా...

ఏడు నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

ఏడు నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

దేశ వాణిజ్య లోటు ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు రికార్డు స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నా, లోటు కూడా అదే స్థాయిలో పెరగడంతో వాణిజ్య లోటు పెరిగిపోతోంది. గత...

15 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

15 నెలల గరిష్ఠానికి టోకు ధరల ద్రవ్యోల్బణం

దేశంలో ధరల మంట కొనసాగుతోంది. టోకు ధరల ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠానికి చేరింది. కూరగాయలు, ఆహార పదార్థాలు, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణం....

తిరుమల ఈవోగా శ్యామలరావు నియామకం

తిరుమల ఈవోగా శ్యామలరావు నియామకం

తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ...

శివయ్యకు ఎవరి రక్షణా అవసరం లేదు : సుప్రీంకోర్టు

శివయ్యకు ఎవరి రక్షణా అవసరం లేదు : సుప్రీంకోర్టు

యమునా నదీ తీరంలో ప్రాచీన దేవాలయం కూల్చివేతను అడ్డుకోవాలంటూ భక్తులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శివాలయానికి సంబంధించిన దస్తావేజులు లేవని, శివయ్యకు ఎవరి రక్షణా అవసరం...

నటి హేమ జైలు నుంచి విడుదల

నటి హేమ జైలు నుంచి విడుదల

తెలుగు సినీ నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమను కర్ణాటక సీఐడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హేమ...

జమ్మూ కశ్మీర్ పాఠశాలల్లోనూ జాతీయ గీతం తప్పనిసరి

జమ్మూ కశ్మీర్ పాఠశాలల్లోనూ జాతీయ గీతం తప్పనిసరి

దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం జాతీయగీతం ఆలపించడం తప్పనిసరి. అయితే జమ్ము కశ్మీర్‌లో ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు. తాజాగా ప్రతి రోజూ ఉదయం...

ఫ్రాన్స్ నుంచి మెరైన్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కీలక చర్చలు

ఫ్రాన్స్ నుంచి మెరైన్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కీలక చర్చలు

రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారం కీలక దశకు చేరింది. ప్రపంచంలోనే అత్యాధునికమైన రఫేల్ యుద్ద విమానాలను, భారత్ ప్రాన్స్ నుంచి ఇప్పటికే 36 కొనుగోలు...

జులై 3న ఆర్థిక సర్వే : జులై 22న కేంద్ర బడ్జెట్

జులై 3న ఆర్థిక సర్వే : జులై 22న కేంద్ర బడ్జెట్

లోక్‌సభ సమావేశాలకు రంగం సిద్దమైంది. జూన్ 24 నుంచి జులై 3 వరకు లోక్‌సభ సమావేశాలు జరగనున్నాయి. 18వ సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక...

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి : ఐదుగురికి తీవ్ర గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి : ఐదుగురికి తీవ్ర గాయాలు

రోడ్లు రక్తమోడాయి. కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం సీతనపల్లి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది....

మాజీ సీఎం యడియూరప్పపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

మాజీ సీఎం యడియూరప్పపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

మానసిక ఆరోగ్యం సరిగా లేని ఓ ఆరేళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ సీనియర్‌నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు సదాశివనగర కోర్టు...

దిండుతో ఊపిరాడకుండా చేసి బంగ్లాదేశ్ ఎంపీని చంపారు

దిండుతో ఊపిరాడకుండా చేసి బంగ్లాదేశ్ ఎంపీని చంపారు

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది.ఎంపీ హత్య కేసులో అరెస్టైన బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ సియాజ్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం...

హత్యా నేరం మీద వేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తా : కన్నడ నటుడు దర్శన్ ఆఫర్

హత్యా నేరం మీద వేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తా : కన్నడ నటుడు దర్శన్ ఆఫర్

కర్ణాటకలో రేణుకా స్వామి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. రేణుకా హత్యతో ప్రమేయం ఉందంటూ పోలీసులు ఇప్పటికే నటుడు దర్శన్ తూగుదీపను అరెస్ట్ చేసి విచారించారు....

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ :: మరో మూడు నెలలు అవకాశం

ఉచితంగా ఆధార్ అప్‌డేట్ :: మరో మూడు నెలలు అవకాశం

ఉచితంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు ఉదయ్ మరో అవకాశం కల్పించింది. మూడు నెలల కిందట ఇచ్చిన అవకాశం రేపటితో ముగియనుంది. దీంతో యూఐడిఏఐ కీలక నిర్ణయం...

నీట్ ఫలితాలపై ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు

నీట్ ఫలితాలపై ఎన్‌టీఏకి సుప్రీం నోటీసులు

నీట్ యూజీ 2024 పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రేస్ మార్కులపై విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు...

జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు ఇటలీకి ప్రధాని మోది

జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు ఇటలీకి ప్రధాని మోది

ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తరవాత మోదీ జీ7 దేశాల సమ్మిట్‌లో పాల్గొనేందుకు కాసేపట్లో ఇటలీకి బయలుదేరనున్నారు. ఇవాళ ఇటలీలో ప్రారంభమయ్యే సమావేశాలు శనివారం వరకు జరగనున్నాయి....

జూన్ 24 నుంచి లోక్‌సభ సమావేశాలు

జూన్ 24 నుంచి లోక్‌సభ సమావేశాలు

కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో 18వ లోక్‌సభ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు సమావేశం కానుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్...

కూలిన విమానం :  మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షలిమా మృతి

కూలిన విమానం : మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షలిమా మృతి

ఇరాన్ అధ్యక్షుడి విమానం కుప్పకూలిన ఘటన మరవక ముందే మరో ఘోరం చోటు చేసుకుంది. మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా ప్రయాణిస్తోన్న విమానం కనిపించకుండాపోయింది. ఎయిర్ ట్రాఫిక్...

మర్డర్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

మర్డర్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ అయ్యారు. రేణుకాస్వామి అనే మహిళ ఇటీవల హత్యకు గురయ్యారు. తరవాత రెండు రోజులకు ఆమె మృతదేహాన్ని...

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక

తెలుగుదేశం, జనసేన, బీజేపీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ విజయవాడలోని ఏ వన్ కన్వెన్షన్ కేంద్రంలో సమావేశ...

ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తే బందీలను చంపేస్తాం : హమాస్

ఇజ్రాయెల్ సైన్యం దూసుకొస్తే బందీలను చంపేస్తాం : హమాస్

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా ముందుకెళుతోన్న సమయంలో హమాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోమవారంనాడు...

జనసేన శాసనసభా పక్ష నేతగా కొణిదెల పవన్ కళ్యాణ్

జనసేన శాసనసభా పక్ష నేతగా కొణిదెల పవన్ కళ్యాణ్

జనసేన శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్‌ను ఎన్నుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం 10 గంటలకు హాజరయ్యారు....

లండన్‌లో తెలుగు యువకుడి దుర్మరణం

లండన్‌లో తెలుగు యువకుడి దుర్మరణం

లండన్‌లో ఘోరం జరిగింది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ప్రమాదవశాత్తు బ్లాక్‌ఫూల్ బీచ్‌లో మరణించాడు. ఉన్నత విద్యకోసం 2021లో లండన్...

అది చిరుతకాదు…పిల్లి

అది చిరుతకాదు…పిల్లి

రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని, మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వీడియోకు చిక్కిన జంతువుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో ఎంపీ...

బాలీవుడ్ నటి మృతి : శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ముందుకు రాని కుటుంబ సభ్యులు

బాలీవుడ్ నటి మృతి : శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ముందుకు రాని కుటుంబ సభ్యులు

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. నటి నూర్ మాలబికా దాస్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలో ఆమె నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు...

ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షరీఫ్ శుభాకాంక్షలు

ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షరీఫ్ శుభాకాంక్షలు

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రమాణ స్వీకారానికి సరిహద్దు దేశాలకు చెందిన దేశాధినేతలను ఆహ్వానించినా పాక్ ప్రధానికి...

మణిపుర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రదాడి

మణిపుర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రదాడి

మణిపుర్‌లో ఉగ్రవాదులు ఏకంగా సీఎం బీరేన్ సింగ్‌ కాన్వాయ్ పై దాడికి తెగబడ్డారు. నేటి ఉదయం కొందరు తీవ్రవాదులు సీఎం కాన్వాయ్‌పై విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు....

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ

ప్రధానిగా ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ, కాసేపటి కిందట పీఎంవోలోని సౌత్‌బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన రెండో వ్యక్తిగా...

ఎంపీగా ఓడినా కేంద్ర మంత్రి వర్గంలో చోటు

ఎంపీగా ఓడినా కేంద్ర మంత్రి వర్గంలో చోటు

కేంద్ర మంత్రి వర్గంలో అనూహ్యంగా ఓడిపోయిన ఓ ఎంపీకి చోటు దక్కింది. పంజాబ్‌లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వీడి రవనీత్ సింగ్ బిట్టు బీజేపీలో చేరారు.పంజాబ్ కాంగ్రెస్...

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం : 9 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం : 9 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో, లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు....

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, నరేంద్ర మోదీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం...

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక మలుపు

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక మలుపు

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో కీలక పురోగతి లభించింది. కోలకతాలో హత్యకు గురైన అన్వరుల్ అజీమ్ అనర్ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు....

కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి 3…తెలంగాణకు 2

కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి 3…తెలంగాణకు 2

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ అందించారు. ఏపీ నుంచి ముగ్గురుకి, తెలంగాణ నుంచి ఇద్దరికి...

ఖలిస్థాన్ ఉద్యమకారులకు కెనడా హెచ్చరిక

ఖలిస్థాన్ ఉద్యమకారులకు కెనడా హెచ్చరిక

ఖలిస్థాన్ మద్దతుదారుల చేష్టలపై కెనడా ప్రభుత్వం సీరియస్ అయింది. కొందరు ఖలిస్థాన్ మద్దతుదారులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా మంత్రి డొమనిక్ ఎల్...

అశృనయనాల మధ్య ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

అశృనయనాల మధ్య ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో అశృనయనాల మధ్య ముగిశాయి. వేలాది మంది అభిమానులు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు....

మోదీ సహా 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం !

మోదీ సహా 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం !

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఇవాళ సాయంత్రం 7 గంటల 15 నిమిషాల నుంచి 8...

ఆమెను కొండచిలువ మింగేసింది

ఆమెను కొండచిలువ మింగేసింది

ఇండోనేషియాలో ఘోరం జరిగింది. ఓ మహిళను కొండచిలువ మింగింది. మధ్యఇండోనేషియాలోని కల్లెపాగ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... 45 సంవత్సరాల పరీదా...

నీట్ యూజీ గ్రేస్ మార్కుల పరిశీలనకు కమిటీ

నీట్ యూజీ గ్రేస్ మార్కుల పరిశీలనకు కమిటీ

వైద్య విద్యలో ప్రవేశానికి ఏటా దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షా ఫలితాలను వివాదాలు చుట్టుముడుతున్నాయి. నీటీ యూజీ 2024 ఫలితాల్లో 67 మందికి మొదటి ర్యాంక్...

నీట్ ఫలితాలపై నీలినీడలు

నీట్ ఫలితాలపై నీలినీడలు

నీట్ యూజీ 2024 ఫలితాలను వివాదాలు చుట్టుముట్టాయి. ఫలితాలు వెలువడిన తరవాత, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక మంది కోర్టుల్లో కేసులు వేశారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల...

హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా మీకు పట్టదా : కంగనా

హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా మీకు పట్టదా : కంగనా

ప్రముఖ నటి, ఎంపీ కంగనాపై సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ దాడి తరవాత మొదటిసారిగా ఆమె స్పందించారు.కంగనాపై దాడి చేసిన కానిస్టేబుల్‌కు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. దీనిపై...

డెన్మార్క్ ప్రధానిపై దాడి

డెన్మార్క్ ప్రధానిపై దాడి

ప్రధాన మంత్రులకే రక్షణ లేకుండా పోయింది. స్లోవేకియా ప్రధానిపై దాడి ఘటన మరవక ముందే డెన్మార్క్ ప్రధానిపై దాడి జరిగింది. ఐరోపా యూనియన్ ఎన్నికలు జరుగుతోన్న వేళ...

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గణేశుడి విగ్రహం తీసుకెళ్లిన సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గణేశుడి విగ్రహం తీసుకెళ్లిన సునీతా విలియమ్స్

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఆమెతోపాటు ఈసారి గణేశుడి విగ్రహం తీసుకెళ్లారు. గతంలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లినప్పుడు సునీతా విలియమ్స్ భగవద్గీత...

మోదీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాల్దీవుల అధ్యక్షుడు

మోదీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాల్దీవుల అధ్యక్షుడు

మోదీ ప్రమాణస్వీకారానికి ఆరు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జుకు కూడా ఆహ్వానం అందింది. మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు భారత్‌పై...

మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం రామోజీరావు అస్తమయం

మీడియా దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల...

స్టాక్ సూచీల సరికొత్త రికార్డు : లాభాల జోరు

స్టాక్ సూచీల సరికొత్త రికార్డు : లాభాల జోరు

వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. కేంద్రంలో స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతోందన్న బలమైన సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు భారీగా స్టాక్స్ కొనుగోళ్లకు...

సీఎంవోలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

సీఎంవోలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

పదవి చేపట్టగానే సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పని ప్రారంభించారు. సీఎంవోలోని ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు,...

ఎన్డీయే అధినేతగా మోదీ : ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను… ప్రధాని

ఎన్డీయే అధినేతగా మోదీ : ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను… ప్రధాని

ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని...

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడి సోదాలు

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడి సోదాలు

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి చెందిన హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే సోదాలు జరుగుతున్నట్లు...

రష్యా నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి

రష్యా నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్థులు మృతి

రష్యాలో ఘోరం జరిగింది. చదువుకోవడానికి రష్యా వెళ్లి సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలో నదిలో దిగిన నలుగురు భారతీయ విద్యార్థులు గల్లంతయ్యారు. వెలికీ నౌగోరాద్ స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదవడానికి...

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్ నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజా మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లిపోవడంతో, ఈ నియామకం చేపట్టారు. 1987...

టీ20లో పాక్‌పై అమెరికా ఘన విజయం

టీ20లో పాక్‌పై అమెరికా ఘన విజయం

టీ20లో పెను సంచలనం నమోదైంది. పాక్‌పై అమెరికా జట్టు సంచలన విజయం నమోదు చేసింది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో అమెరికా జట్టు విజయం...

సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్

సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్

ప్రపంచ ప్రఖ్యాత వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గురువారం సురక్షితంగా అంతత్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. స్టార్‌లైనర్ స్పేష్‌షిప్ గురువారం రాత్రి అంతర్జాతీయ అంతరిక్ష...

కంగనా రనౌత్ చెంప పగలగొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్

కంగనా రనౌత్ చెంప పగలగొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్

ప్రముఖ నటి, బీజేపీ మండి ఎంపీ కంగనా రనౌత్‌కు ఘోర అవమానం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో మహిళా సీఐఎస్ఎఫ్ జవాన్ కంగనా చెంప పగలకొట్టింది. రైతుల నుద్దేశించి...

మరోసారి 75 వేలు దాటిన సెన్సెక్స్

మరోసారి 75 వేలు దాటిన సెన్సెక్స్

కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందన్న సానుకూల సంకేతాలతో దేశీయ స్ఠాక్ సూచీలు రెండో రోజూ లాభాల్లో దూసుకెళ్లాయి. ఈ నెల 9వ తేదీన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం...

మా ప్రాధమిక సభ్యత్వం నుంచి నటి హేమ సస్పెండ్

మా ప్రాధమిక సభ్యత్వం నుంచి నటి హేమ సస్పెండ్

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించడంతో నటి హేమను మా సభ్యత్వం నుంచి తొలగించారు. తెలుగు చిత్ర నటీనటుల సంఘం మాలో నటి హేమకు...

అక్రమ వీసాల కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్

అక్రమ వీసాల కేసులో కార్తీ చిదంబరానికి బెయిల్

అక్రమ వీసాల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరానికి బెయిల్ లభించింది. 2011లో 263 మంది చైనీయులకు వీసాల జారీలో మనీలాండరింగ్‌నకు పాల్పడ్డారని...

మోదీ ప్రమాణ స్వీకారానికి అతిథులుగా పలు దేశాల అధినేతలు

మోదీ ప్రమాణ స్వీకారానికి అతిథులుగా పలు దేశాల అధినేతలు

ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దమైంది. ఈ నెల 9న మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్,...

పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు : భారీ లాభాల్లో స్టాక్స్

పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు : భారీ లాభాల్లో స్టాక్స్

స్టాక్ మార్కెట్ల నష్టాలకు బ్రేక్ పడింది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపించడంతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరిగాయి. తాజాగా గురువారం ఉదయం సెన్సెక్స్ 391...

టీ20లో భారత్ ఘన విజయం

టీ20లో భారత్ ఘన విజయం

టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. భారత ఆటగాళ్లు తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో మొదటి విజయం నమోదు చేశారు. హార్దిక్ పాండ్యా...

స్ట్రోక్ మార్కెట్లు :: 30 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్ట్రోక్ మార్కెట్లు :: 30 లక్షల కోట్ల సంపద ఆవిరి

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ మదుపరులను భారీ నష్టాల్లోకి నెట్టింది. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు తెగబడ్డారు....

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూటమి

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కూటమి

ఏపీలో కూటమి అధికారం ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి అభ్యర్థులు 158 స్థానాల్లో మెజారిటీలో ఉన్నారు. వైసీపీ కేవలం 17 సీట్లలో ఆధిక్యంలో...

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘన విజయం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘన విజయం

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్...

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

స్టాక్ మార్కెట్లు భారీ పతనం

సార్వత్రిక ఫలితాలు స్టాక్ మార్కెట్లను నిరాశ పరిచాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు, ఫలితాల ట్రెండ్స్ మొదలు కాగానే భారీ నష్టాలను చవిచూశాయి....

మాల్దీవులు వద్దు : లక్షద్వీప్ ముద్దు :: ఇజ్రాయెల్ కాన్సులేట్ ప్రకటన

మాల్దీవులు వద్దు : లక్షద్వీప్ ముద్దు :: ఇజ్రాయెల్ కాన్సులేట్ ప్రకటన

ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి అనుమతించ కూడదని మాల్దీవులు నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోన్న వేళ కీలక నిర్ణయం వెలువడింది. మాల్దీవుల కన్నా లక్షద్వీప్ ముద్దంటూ...

పాలస్తీనాపై ఆరు వారాలు యుద్ధం ఆపుతాం : ఇజ్రాయెల్ ప్రధాని

పాలస్తీనాపై ఆరు వారాలు యుద్ధం ఆపుతాం : ఇజ్రాయెల్ ప్రధాని

ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్ ఒత్తిడి మేరకు ఆరు వారాలు యుద్దం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు...

దేశ వ్యాప్తంగా బీజేపీ హవా : ఏపీలో కూటమి దూకుడు

దేశ వ్యాప్తంగా బీజేపీ హవా : ఏపీలో కూటమి దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తొలి 2 రౌండ్లు వెలువడ్డాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతోంది. 272 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇండియా కూటమి...

రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

రేవ్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం కేసులో తెలుగు సినీ నటి హేమను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. వంద మందికిపైగా పాల్గొన్న రేవ్ పార్టీలో దాదాపు...

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నంబూరు శేషగిరిరావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ఇచ్చిన...

బ్రహ్మోస్ క్షిపణి తయారీకి పనిచేసిన మాజీ ఇంజనీరుకు జీవితఖైదు

బ్రహ్మోస్ క్షిపణి తయారీకి పనిచేసిన మాజీ ఇంజనీరుకు జీవితఖైదు

బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టులో పనిచేసిన ఓ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు సమాచారం లీక్ చేసిన కేసులో నాగపూర్ సెషన్స్ కోర్టు...

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఇది ప్రపంచ...

ఆరోజు తాగి ఉన్నా…అందుకే ఏం గుర్తుకు రావడం లేదు : పుణే బాలుడు

ఆరోజు తాగి ఉన్నా…అందుకే ఏం గుర్తుకు రావడం లేదు : పుణే బాలుడు

మద్యంతాగి లగ్జరీ కారును అత్యంత వేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన బాలుడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రమాదం చేసిన బాలుడిని పోలీసులు...

అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్

అమెరికాలో తెలుగు విద్యార్ధుల మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ, మరో విద్యార్థిని కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కందుల నితీశ వారం నుంచి...

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు : విస్తారంగా వర్షాలు

రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు : విస్తారంగా వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాయలసీమలో రుతుపవనాలు ప్రవేశించినట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమతోపాటు కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు కురిసే...

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల దూకుడు

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ ఫోల్స్ కేంద్రంలో మరలా బీజేపీ ప్రభుత్వం వస్తోందనే రిపోర్టులు ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్‌రన్ ప్రారంభించాయి. ఇవాళ ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్...

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

ఏఆర్ కానిస్టేబుల్ వేదవతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. మెయిన్ గేటు వద్ద కాపలాగా ఉన్న...

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించిన మాల్దీవులు

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించిన మాల్దీవులు

పాలస్తీనాకు క్రమంగా వివిధ దేశాల మద్దతు పెరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోని అనుమతించకూడదని మాల్దీవులు నిర్ణయించింది. ఆదివారం సమావేశమైన మాల్దీవుల మంత్రి మండలి దీనిపై...

3 రోజులు మద్యం దుకాణాలు బంద్

3 రోజులు మద్యం దుకాణాలు బంద్

రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగే అవకాశ ముందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల...

వరల్డ్ నెంబర్ 2ను ఓడించి టాప్ 10లో అడుగు పెట్టిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

వరల్డ్ నెంబర్ 2ను ఓడించి టాప్ 10లో అడుగు పెట్టిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

అంతర్జాతీయ చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద దూసుకెళుతున్నారు.ఇటీవల ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ ఆటగాడిని ఓడించిన ప్రజ్ఞానంద, ఇవాళ నెంబరు 2 ర్యాంకర్‌ను మట్టికరిపించాడు. వరుసగా ఇద్దరు...

చంద్రుడి అవతలివైపు దిగిన చైనా చాంగే 6

చంద్రుడి అవతలివైపు దిగిన చైనా చాంగే 6

డ్రాగన్ కంట్రీ మరో ఘనత సాధించింది. చైనా చంద్రుడిపై ప్రయోగించిన లూనార్‌ల్యాండర్ చాంగే 6 విజయవంతమైంది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చాంగే 6 విజయవంతమైనట్లు అధికారికంగా...

ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదు : సిట్

ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదు : సిట్

వందలాది మందిపై లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కర్ణాటక హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని పోలీసులు వెల్లడించారు. రేవణ్ణను కోర్టు ఆరు రోజుల...

ఆ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది

ఆ రెండు రాష్ట్రాల్లో కౌంటింగ్ మొదలైంది

సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రానికే ముగిశాయి. దేశ వ్యాప్తంగా 4వ తేదీ కౌంటింగ్ మొదలవుతుంది. అయితే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఆదివారంనాడే కౌంటింగ్ ప్రారంభమైంది. అక్కడి అసెంబ్లీలకు...

డబ్బు అడిగాడని కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

డబ్బు అడిగాడని కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కన్నతండ్రే కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒంగోలు భాగ్యనగర్‌లోని ఈవీఎం గిడ్డంగి వద్ద...

పీవోకే విదేశీ భూభాగమే : అంగీకరించిన పాకిస్థాన్

పీవోకే విదేశీ భూభాగమే : అంగీకరించిన పాకిస్థాన్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ తమ దేశానికి చెందింది కాదని, అది విదేశీ భూభాగమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టుకు విన్నవించింది. పీవోకేలో పాకిస్థాన్ చట్టాలు చెల్లవని స్పష్టం...

నాగపూర్‌లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు

నాగపూర్‌లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు

దేశంలో ఎండలు మండుతున్నాయి. మూడు రోజుల కిందట ఢిల్లీలో 52.9 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా నాగపూర్ ఆ రికార్డులను బద్దలు కొట్టింది. శుక్రవారంనాడు...

Page 7 of 8 1 6 7 8