Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home వాతావరణం, పర్యావరణం

అంటార్కిటికాలో గత పాతికేళ్ళలో ఎంత మంచు కరిగిపోయిందో తెలుసా?

param by param
May 11, 2024, 06:36 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిమఖండం అంటార్కిటికాలో 1997 నుంచీ
కరిగిపోయిన మంచుఫలకాల్లో 40శాతానికి పైగా ఫలకాలు మళ్ళీ గడ్డకట్టే అవకాశాలు లేవని ఓ
అధ్యయనం తేల్చింది. పర్యావరణ కాలుష్యం, వాతావరణంలో మార్పుల కారణంగా చోటు
చేసుకుంటున్న దుష్పరిణామాల ప్రభావమే ఇదని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేసారు.

ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు
చెందిన శాస్త్రవేత్తల
బృందం
అంటార్కిటికాలో మంచు కరిగి, తరిగిపోతున్న తీరుతెన్నులపై అధ్యయనం చేసారు. 1997 నుంచి
2021 వరకూ పాతికేళ్ళ వ్యవధిలో అంటార్కిటికా పశ్చిమ భాగంలో  67 టన్నుల మంచు కరిగిపోయిందని వారి అధ్యయనంలో
తేలింది. అదే సమయంలో అంటార్కిటికా తూర్పు భాగంలో 59 టన్నుల మంచు పేరుకుందని కూడా
వారు గమనించారు. ఫలితంగా… ఆ పాతికేళ్ళ వ్యవధిలో కరిగిపోయిన మంచు నికరంగా 7.5
టన్నులు అని శాస్త్రవేత్తలు లెక్కించారు.

అంటార్కిటికా
పశ్చిమభాగంలో ఉండే ఉష్ణజలాల కారణంగానే అక్కడ మంచు కరిగిపోయిందని అధికారులు
నిర్ధారించారు. అయితే అంటార్కిటికా తూర్పు భాగంలో మంచు ఫలకాలు యథాతథ స్థితిలో
ఉండిపోవడమో, లేక అక్కడ సముద్ర జలాలు సాధారణ స్థితి కంటె ఎక్కువ చల్లబడడమో
జరిగిందని వారు భావిస్తున్నారు. హిమనీ నదాల అంచుల్లో ఉండే మంచు ఫలకాలు, మంచు వేగంగా
కరిగి సముద్రజలాల్లో కలిసిపోకుండా నిలువరిస్తాయి. ఆ ఫలకాలు కుంచించుకుపోయినప్పుడు
హిమనీ నదాలు సముద్రంలోకి భారీమొత్తంలో మంచినీటిని వదులుతాయి, అది దక్షిణ
మహాసముద్రంలోని
సాగరప్రవాహాలకు భంగం కలిగిస్తాయి.

ఈ అధ్యయన బృందానికి
నాయకుడు డాక్టర్ బెంజమిన్ డేవిసన్ ఇలా చెబుతున్నారు: ‘‘మంచు పలకల క్షీణతలో ఒక
మిశ్రమ పరిస్థితి ఉంది. దానికి కారణం అంటార్కిటికా చుట్టూ ఉన్న సముద్రంలోని
ఉష్ణోగ్రత, ఇంకా సముద్ర ప్రవాహాలు. అంటార్కిటికా పశ్చిమ భాగంలో ఈ మంచు పలకలు గోరువెచ్చని
నీటివల్ల ప్రభావితం అవుతుంటాయి. దానివల్ల మంచు పలకలు అడుగునుంచీ క్రమక్రమంగా
కరిగిపోతూ ఉంటాయి. అదే సమయంలో అంటార్కిటికా తూర్పుభాగంలోని ఎక్కువ ప్రాంతానికి ఆ
ముప్పు లేదు. తీరప్రాంతంలోని శీతలజలాలు ఈ ఉష్ణజలాల నుంచి మంచు పలకలను కాపాడతాయి.’’

అంటార్కిటికా
హిమఖండంలో ఏటికేటా చోటు చేసుకుంటున్న మార్పులను శాస్త్రవేత్తలు నమోదు
చేస్తున్నారు. సుదీర్ఘ ధ్రువరాత్రుల్లో సైతం దట్టమైన మబ్బులకు ఆవరించి ఉన్న
పరిస్థితుల్లో కూడా పనిచేయగల ఉపగ్రహాల ద్వారా ఈ మార్పులను గుర్తించి నమోదు
చేస్తున్నారు.

 అలా, శాస్త్రవేత్తలు
మంచు పలకల ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి అంతరిక్షం నుంచి తీసిన లక్షకు పైగా
చిత్రాలను అధ్యయనం చేసారు. ఆ ఫలితాలు మిగతా ప్రపంచానికి ప్రభావితం చేయగల ఆ
ఫలితాలను పలు వైజ్ఞానిక పత్రికల్లో ప్రచురించారు.

 గత పాతికేళ్ళ
నుంచి మంచుపలకలు కరగడం వల్ల సుమారు 67 టన్నుల స్వచ్ఛమైన జలాలు సముద్రంలోకి విడుదల కావడం…
ప్రపంచమంతా ఉష్ణోగ్రతలను, పోషకాలను సరఫరా చేసే సముద్ర ప్రవాహాలపై ప్రభావం చూపింది.

 ఇది సాధారణంగా ప్రకృతిసహజమైన
పరిణామమే అయితే మంచు మళ్ళీ పెరిగి ఉండేది, తద్వారా పర్యావరణంలో ఎలాంటి మార్పూ
ఉండేది కాదు. కానీ పర్యావరణ సంక్షోభం కారణంగా ఈ మంచు కరిగే ప్రక్రియ చోటు
చేసుకుంది. అందువల్ల అది సముద్ర తత్వంలోనూ, దానిపై ఆధారపడిన జీవజాలాల మనుగడపైనా తీవ్ర
ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

 ‘‘చాలావరకూ మంచుపలకలు
వేగంగా, కానీ తక్కువ కాలం పాటు కుంచించుకుపోతాయి, తర్వాత మెల్లమెల్లగా పెరుగుతాయి అని
మేం భావించాం. కానీ వాటిలో సగానికి పైగా మంచు పలకలు మళ్ళీ పెరిగే అవకాశం లేకుండా
కుంచించుకుపోతున్నాయని మా పరిశీలనలో తేలింది’’ అని డేవిసన్ స్పష్టం చేసారు.

 గతనెల జరిగిన ఒక
అధ్యయనం, మిగతా ప్రపంచం కంటె అంటార్కిటికా రెండు రెట్లు ఎక్కువ వేడెక్కుతోందని
కనుగొంది. పర్యావరణ సంక్షోభ అధ్యయనాలు వేసిన అంచనాల కంటె ఇది చాలా ఎక్కువ. ఫ్రాన్స్‌కు
చెందిన శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో వెయ్యేళ్ళ క్రితం ఉష్ణోగ్రతలు ఎలా ఉండేవో
తెలుసుకునేందుకు హిమఖండం నుంచి 78 మంచు నమూనాలను సేకరించి విశ్లేషించారు. ప్రకృతి
సహజమైన మార్పుల వల్ల కంటె, ఇతర కారణాల వల్లనే అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా
పెరుగుతున్నాయని వారి అధ్యయనంలో తేలింది.

ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

Latest News

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

భారత్ పాక్ వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోం : అమెరికా

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.