Wednesday, May 21, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

K Venkateswara Rao by K Venkateswara Rao
May 21, 2025, 12:55 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో కూంబింగ్ చేస్తోన్న బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు మొదలయ్యాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొంత మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మావోయిస్టు కీలక నేత ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కూంబింగ్ ఆపరేషన్లో నారాయణపూర్, దంతెవాడ,బీజాపూర్ జిల్లాల డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పులు కొనసాగుతున్నాయి.

అబూజ్మడ్ పరిధిలోని బటైల్ అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులున్నట్లు పక్కా సమాచారంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరావు ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు సమాచారం అందుతోంది. కేశవరావుపై కోటి రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు.

బస్తర్ పరిధిలోని నాలుగు జిల్లాల భద్రతా బలగాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. ఈ ఘటనను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధ్రువీకరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో కేశవరావు ఒకరు.

వరంగల్ నిట్ విద్యాసంస్థలో ఉన్నత విద్యనభ్యసించిన కేశవరావు మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై అందులో చేరారు. మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమిషన్ అధిపతిగా పనిచేశాడు. గెరిల్లా దాడులకు వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట.

1970 నుంచి కేశవరావు మావోయస్టుగా పనిచేస్తున్నారు. 2010లో ఛత్తస్‌గఢ్‌లో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు కేశవరావు ప్రధాన సూత్రధారి. కేశవరావు దళంలో ఉన్నారనే పక్కా సమాచారంలో బలగాలు ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

Tags: andhratodaychattisgarh encounterChhattisgarh encounterchhattisgarh naxal encounterEncounter In Chhattisgarhnarayanpur naxal encounternaxal encounterSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా
Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1
general

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1
general

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ
general

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు
general

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

Latest News

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఎన్‌కౌంటర్ ‌: 28 మంది మావోయిస్టులు హతం

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.