Thursday, May 15, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

Phaneendra by Phaneendra
May 15, 2025, 12:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పాకిస్తాన్ తాజాగా భారతదేశానికి ఒక లేఖ రాసిందని తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం విషయంలో పునరాలోచించాలని ఆ లేఖలో పాకిస్తాన్ కోరిందని సమాచారం. పాకిస్తాన్ భూభాగంలోకి నదుల ప్రవాహాన్ని కొనసాగనివ్వాలంటూ ఆ దేశపు జలవనరుల శాఖ భారతదేశాన్ని అర్ధించిందని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది.

సింధు నదీ జలాల ఒప్పందం ఆరు దశాబ్దాలకు పైబడిన కాలం నుంచీ అమల్లో ఉంది. 1960 నాటి ఆ ఒప్పందాన్ని భారతదేశం తాజాగా నిలిపివేసింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో భారతదేశం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది.

జాతీయ భద్రతే తమకు ప్రధానమని స్పష్టం చేసిన భారత్, ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపివేసిందని తమకు నమ్మకం కుదిరేటంత వరకూ సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని భారత్ ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఆమోదించింది. అలా, ప్రపంచ బ్యాంకు కుదిర్చిన ఒప్పందం మీద మొట్టమొదటిసారి న్యూఢిల్లీ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమం వైపు ప్రవహించే నదులు సింధు, ఝీలం, చీనాబ్ నదుల నీటిని పాకిస్తాన్‌, తూర్పు దిశగా ప్రవహించే నదులు సట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవాలి. దాని ప్రకారం సింధు నదీ ప్రవాహంలో 70 శాతం పాకిస్తాన్‌, 30శాతం భారతదేశమూ పంచుకోవాలి.

ఇప్పుడు సింధు నదీ జలాలు భారత్‌కు అందుబాటులోకి వచ్చాయి, వాటి మీద గతంలో ప్రారంభించి నిలిపివేసిన జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం మళ్ళీ తెరమీదకు వచ్చింది. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది.  

అయితే భారత భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా దిగువకు వదలబోమని, ఆ మేరకు కఠిన చర్యలు తీసుకుంటామనీ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేసారు.

Tags: Indus WaterTreaty Suspendedoperation sindoorpahalgam terror attacksPak Letter to IndiaTOP NEWS
ShareTweetSendShare

Related News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ
Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం
general

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతలను రక్షించిన బజరంగ్‌దళ్, గోరక్షా దళ్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.