Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home Latest News

రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం : ఈడీ దర్యాప్తునకు టీడీపీ ఎంపీ డిమాండ్

K Venkateswara Rao by K Venkateswara Rao
Mar 25, 2025, 10:12 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఏపీలో వైసీపీ పాలనలో రూ.4 వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, దీనిపై ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ టీడీపీ పార్లమెంటరీ నేత,నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరారు. ఏపీ మద్యం కుంభకోణంతో పోల్చుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కాం సముద్రంలో నీటి బొట్టంతేనని వ్యాఖ్యానించారు. ఇన్‌ఫ్రా కంపెనీ పేరుతో సునీల్‌రెడ్డి అనే వ్యక్తి మద్యం అవినీతి ద్వారా పోగేసిన రూ.2 వేల కోట్లు దుబాయ్ తరలించారని దీనిపై ఈడీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో 99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగితే, అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని, రూ.4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందని సభ దృష్టికి తీసుకొచ్చారు.లోక్‌‌సభలో ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై మాట్లాడారు.

అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేశారని, 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయానికి ఏపీలో రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లు ఉందని గుర్తుచేశారు. 2014 నుంచి 2024 మధ్య కాలంలో వ్యవసాయరంగం వృద్ధి దేశంలో 17 నుంచి 14.4 శాతానికి పడిపోయిందన్నారు. ఏపీలో మాత్రం 24 నుంచి 35 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రం వ్యవసాయంపైనే ఆధారపడి ఉందనే విషయాన్ని తెలియజేస్తోందన్నారు. ఇదే సమయంలో సేవారంగం వాటా 51 శాతం నుంచి 41 శాతానికి పతనమైందన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలని ఎంపీ కోరారు.

ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాలనలో మద్యంలో అవినీతి బాహుబలి, పుష్ఫ, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల ఆదాయాన్ని మించి పోయిందన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అందుకే వైసీపీ ఎంపీకి ఇంకా నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేసి పారిపోయాడన్నారు. సినిమాల్లో ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుందని, ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలోనూ అదే చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి రాక ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక పేదలు తాగలేని విధంగా మద్యం ధరలు పెంచామన్నారు. మరోవైపు తక్కువ ధరలకు అమ్మాలంటూ అంతర్జాతీయ బ్రాండ్లను తరిమికొట్టారని గుర్తుచేశారు. ఏపీలో 22 మద్యం తయారీ డిస్టలరీలు స్వాధీనం చేసుకుని, మరో 26 కొత్తవి ఏర్పాటు చేసి నాణ్యత లేని మద్యం అత్యధిక ధరలకు అమ్మి వేల కోట్లు కాజేశారని ఎంపీ ఆరోపించారు. ఈ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టాలని కోరారు.

దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందని, 2019 నుంచి 2024 మధ్య కాలంలో లక్ష కోట్ల డిజిటల్ లావాదేవీల నుంచి 200 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. అయితే ఏపీలో మాత్రం ఐదేళ్ల వైసీపీ పాలనలో 99 వేల కోట్ల మద్యం వ్యాపారంలో కేవలం, రూ.690 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయని, ఇది రివర్స్‌లో జరిగిందన్నారు. ఏపీలో రూ.18 వేల కోట్లు మద్యంలో అక్రమాలు జరిగాయని, ఇదంతా ప్రజల సొమ్మేనని దర్యాప్తు చేపట్టాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు.

Tags: andhratodayAPap newsap politicsfertilizers scamliquor in apLiquor scammp lavu krishna speech at parliamentSLIDERTOP NEWSycp mp krishna devarayaluycp scamsYSRCP
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం
Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ
Latest News

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి
general

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం
general

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
general

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Latest News

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

ఆపరేషన్ సిందూర్ విజయం స్వదేశీ సాంకేతిక వ్యవస్థల ఫలితం

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాక్ మిత్రదేశాలకు భారతీయుల బాయ్‌కాట్ దెబ్బ

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకరదాడులు : 54 మంది మృతి

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

ఎన్‌కౌంటర్:ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం : ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

సింధు జలాల నిలిపివేతపై పునరాలోచించండి: పాక్ వేడికోలు

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

టీఆర్ఎఫ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించండి : ఐరాసలో భారత్ యత్నం

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

పీవోకేలో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయాలి : బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

మణిపుర్‌లో పది మంది మిలిటెంట్లు హతం

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.