Monday, May 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

కట్టేసి, అత్యాచారం చేసి, చంపేస్తామని బెదిరించి…

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళల దయనీయ గాధలు

Phaneendra by Phaneendra
Aug 8, 2024, 06:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు పూర్తిస్థాయి హిందూవ్యతిరేక హింసాకాండగా మారిపోయాయి. ఇస్లామిస్టులు ఇంటింటికీ వెళ్ళి హిందువులను చంపేస్తున్నారు. హిందువుల ఇళ్ళను, గుళ్ళను వెతికి పట్టుకుని వెళ్ళి మరీ దాడులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దోపిడీలు, ఆస్తుల విధ్వంసాలు, ఇళ్ళు తగులబెట్టడాలు, హిందువులను చంపేయడాలు జరుగుతున్నాయి. ఇంక హిందూమహిళలపై అత్యాచారాలు ఆగడమే లేదు.

దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలను లక్ష్యం చేసుకుని ధ్వంసం చేస్తున్నారు. నాటోరే, ఢాకాలోని ధామ్‌రాయ్, పటువాఖలీలోని కాలాపరా, షరియత్‌పూర్, ఫరీద్‌పూర్‌లలో ఆలయాలను కూల్చేసారు. జెస్సోర్, నవఖాళీ, మెహెర్‌పూర్, చాంద్‌పూర్, ఖుల్నా తదితర ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరిగాయి. దినాపూర్‌లో హిందువులకు చెందిన 40 దుకాణాలను ధ్వంసం చేసారు. ఆ హింసాకాండలో నిర్దుష్టంగా హిందూ మహిళలను లక్ష్యం చేసుకున్నారు.

పిరోజ్‌పూర్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో హిందూ మహిళలపై అమానుషంగా అత్యాచారాలు జరిగాయి. ‘‘వాళ్ళు కత్తులు, పదునైన ఆయుధాలు పట్టుకుని వచ్చారు. ఇల్లంతా దోచుకున్నారు. మా అమ్మాయిల మీద పడ్డారు. వారిని రక్షించడం కోసం మేం అడ్డం పడ్డాం’’ అని ఒకామె చెప్పింది.

‘‘వాళ్ళు రాత్రివేళ వచ్చారు, మా ఇళ్ళను ధ్వంసం చేసారు. అంతా దోచుకున్నారు. మేం దాక్కున్నాం. మా బావ భార్య దొరికిపోయింది. ఆమెను ఓ గదిలోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేసారు. ఆమె ముఖాన్ని కట్టేసారు. ఆమె పీక కోసేయబోయారు. చివరికి, బంగారు ఆభరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు’’ అని ఒక మహిళ చెప్పింది.

‘‘ఆ రాత్రి మేం నిద్రపోతున్న సమయంలో వాళ్ళు ఆయుధాలతో వచ్చారు. ‘మేం యాభై మందిమి ఉన్నాము, మీరు మానుంచి తప్పించుకోలేరు’ అని వారు మమ్మల్ని బెదిరించారు. వాళ్ళు మా ఇళ్ళనన్నింటినీ దోచుకున్నారు. నన్ను ఈడ్చుకెళ్ళి మంచానికి కట్టేసారు. చంపేస్తానని బెదిరించారు. నన్ను వదిలేయండి లేదా చంపేయమని వారిని బతిమాలాను. వాళ్ళు నన్ను ఏడవద్దంటూ కొట్టారు. చివరికి మా దగ్గరున్న విలువైన వస్తువులు ఇమ్మన్నారు. నా నగలన్నీ ఇచ్చేసాను. అదృష్టవశాత్తూ నన్ను ఏమీ చేయకుండా వదిలేసారు’’ అని మరొక మహిళ చెప్పుకొచ్చింది.

 

హిందువులపై దాడులు ఎలా చేస్తున్నారు?

బంగ్లాదేశ్‌లోని జమాతే ఇస్లామీ సంస్థ సభ్యులు దేశమంతటా హిందువుల ఇళ్ళు, దుకాణాలు, వ్యాపారసంస్థల వివరాలన్నీ ముందే సేకరించారు. షేక్ హసీనా గద్దె దిగిపోయిన వెంటనే వాళ్ళు తమ అరాచకాలు మొదలుపెట్టారు. ముస్లిములు, జమాతే ఇస్లామీ సభ్యులు గుంపులు గుంపులుగా వీధుల్లో తుపాకులతో తిరిగారు. దాంతో హిందువులకు సురక్షిత ప్రాంతాలకు పారిపోవడానికి మార్గమే లేకుండా పోయింది.  

ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన అన్న పేరుతో ఇస్లామిస్టులు హిందువుల ఇళ్ళు, దుకాణాలు, గుడులపై దాడులు మొదలుపెట్టారు. హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనల సాకుతో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీల మీద జరుగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేసారు.

హిందువుల మీద దాడులు, అత్యాచారాల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడ జరుగుతున్న హింస తీవ్రతను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. బంగ్లాదేశ్‌ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడం తక్షణావసరం అని వివరిస్తున్నాయి.

Tags: andhra today newsAtrocities on HindusBangladeshJamaat-e-IslamiSLIDERTargeted RapesTOP NEWS
ShareTweetSendShare

Related News

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

general

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం
general

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ
general

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

Latest News

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-3

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-2

పాక్ ఆక్రమిత భూభాగాలను ఐక్యం చేసిన ఆపరేషన్ సిందూర్-1

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు

జూన్ నుంచి థియేటర్లు బంద్

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు తీవ్ర అస్వస్థత : గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం : 17 మంది మృతి

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ 61 ప్రయోగంలో సాంకేతిక లోపం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

మ్యూజియాలు చారిత్రక ప్రదేశాల్లో నేడు ఉచిత ప్రవేశం

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు : రక్షణ శాఖ

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

తిరుపతిలో రూ.500 కోట్లతో అత్యాధునిక బస్ టెర్మినల్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.