Sunday, July 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

‘అంబానీ-అదానీల మీద రాత్రికిరాత్రి మూగపోయారేం?’

param by param
May 12, 2024, 11:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Modi asks RaGa why overnight silence on Ambani and Adani

ఇన్నాళ్ళూ అంబానీ-అదానీ పేర్లతో దాడులు చేసిన కాంగ్రెస్
నేత రాహుల్ గాంధీ ఒక్కసారిగా ఆ పేర్లను ఎందుకు వదిలేసారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ
ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ,
అంబానీ అదానీల విషయంలో రాహుల్ ఉన్నట్టుండి ఎందుకు మూగపోయారని నిలదీసారు.

‘‘ఐదేళ్ళుగా కాంగ్రెస్ యువరాజు ఒకే విషయాన్ని
జపిస్తూ వచ్చారు. రఫేల్ విషయం మీద ఆరోపణలు నిరాధారమని తేలేసరికి కొత్తపేర్లు
పట్టుకున్నారు. ఐదుగురు పారిశ్రామికవేత్తలు అంటూ ఒకటే జపం చేసారు. క్రమంగా ఐదుగురి
నుంచి ఇద్దరికి తేలారు. అంబానీ, అదానీ అంటూ మొదలుపెట్టారు. కానీ ఎన్నికలు
ప్రకటించిన తర్వాత అంబానీ, అదానీలను దూషించడం ఆపేసారు. ఇవాళ తెలంగాణ గడ్డ మీదనుంచి
అడుగుతున్నాను. అంబానీ, అదానీ నుంచి ఆయన ఎంత డబ్బు తీసుకున్నారు? ఏమైనా ఒప్పందం
కుదిరిందా? రాత్రికి రాత్రి అంబానీ, అదానీలను దూషించడం ఎందుకు ఆపేసారు. ఎక్కడో ఏదో
తేడా జరిగింది. ఐదేళ్ళపాటు వాళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఇప్పుడు,
ఇప్పటికిప్పుడు ఆపేసారెందుకు?’’ అని ప్రధానమంత్రి ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో
ఏదో ఒక వివాదం సృష్టించడం రాహుల్‌కు అలవాటని, 2019 ఎన్నికల సమయంలో రఫేల్ ఒప్పందంలో
కుంభకోణం జరిగిందంటూ రచ్చ చేసారని గుర్తుచేసారు.

ప్రధానమంత్రి ఈ ప్రశ్న సంధించడానికి ఎంచుకున్న సమయం,
సందర్భం కూడా గుర్తించదగినవే. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే అదానీ
గ్రూప్‌తో వివిధ రంగాల్లో సుమారు 12.4వేల కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు
కుదుర్చుకుంది.

అంబానీ, అదానీలే కాక సంపద సృష్టికర్తలైన
అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలపై కాంగ్రెస్ నిర్హేతుక విమర్శలు చేస్తోందని బీజేపీ
మొదట్నుంచీ మండిపడుతోంది. రాహుల్ గాంధీ మొదట్లో నరేంద్రమోదీ ప్రభుత్వం కొంతమంది
అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించేవారు. 22మంది భారతీయులను
కోటీశ్వరులు చేసారని, అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోట్లాదిమందిని
లక్షాధికారులను చేస్తుందనీ వ్యాఖ్యలు చేసారు.

ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన
గౌరవ్ వల్లభ్, గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటూ తనను కాంగ్రెస్ పార్టీ
బలవంతం చేసేదని వెల్లడించారు.

Tags: AdaniAmbaniNarendra ModiOvernight SilenceRahul Gandhi
ShareTweetSendShare

Related News

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?
general

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?
general

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

Latest News

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

సనాతన జ్ఞానపు శాశ్వత జ్వాల, భగవా ధ్వజమే గురుస్థానం

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

భద్రాద్రి రామయ్య భూముల ఆక్రమణ, ఈఓపై దాడి… ఏమిటా వివాదం?

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

ఆది గురువు వ్యాసుడికి తొలి వందనం

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.